Ricky Ponting : పాంటింగ్ టాప్-5 లో పాండ్యా..బుమ్రా

విరాట్ కోహ్లీ..రోహిత్ శ‌ర్మ‌కు నో చాన్స్

Ricky Ponting : ఇది ఊహించ‌ని షాక్. ప్ర‌పంచ క్రికెట్ మాజీ దిగ్గ‌జం రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వ‌ర‌ల్డ్ వైడ్ గా టి20 ఫార్మాట్ కు సంబంధించి అయిదుగురు టాప్ ఆట‌గాళ్ల‌ను గుర్తించాడు.

విచిత్రం ఏమిటంటే ఇందులో స్టార్ బ్యాట‌ర్ ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ పేర్లు లేక పోవ‌డం విశేషం. ది ఐసీసీ రివ్యూ సంద‌ర్భంగా త‌న అభిప్రాయాన్ని పంచుకున్నాడు రికీ పాంటింగ్(Ricky Ponting).

ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ టీమిండియాకు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆసియా క‌ప్ తో స‌హా అత్యున్న‌త స్థాయి సీరీస్ ల‌తో పోటీకి సిద్దం అవుతోంది. 2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ నుండి భార‌త దేశం ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఐసీసీ టైటిల్ గెల‌వ‌లేదు.

త్వ‌ర‌లో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. గ‌త కొన్ని నెల‌లుగా భార‌త జ‌ట్టు యువ ఆట‌గాళ్లు దుమ్ము రేపుతున్నారంటూ కితాబు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా ఐదుగురు ప్లేయ‌ర్ల‌ను ఎంపిక చేశాడు. ఆస్ట్రేలియ‌న్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రాను కూడా జాబితాలో చేర్చాడు.

బుమ్రాతో పాటు ఆఫ్గ‌నిస్తాన్ కు చెందిన ర‌షీద్ ఖాన్ తో పాటు పాకిస్తాన్ కు చెందిన కెప్టెన్ బాబ‌ర్ ఆజం, ఇంగ్లండ్ కు చెందిన జోస్ బ‌ట్ల‌ర్ కూడా ఉన్నారు.

పాండ్యాను వీరితో పాటు చేర్చాడు రికీ పాంటింగ్. ఈ మ‌ధ్య అత‌ను అద్భుతంగా రాణిస్తున్నాడ‌ని కితాబు ఇచ్చారు. బ‌హుశా ప్ర‌పంచం లోనే అత్యుత్త‌మ ఆల్ రౌండ‌ర్ గా ఎదిగాడ‌ని పేర్కొన్నాడు పాంటింగ్.

Also Read : అర్ష్ దీప్ సింగ్ దేశానికి గ‌ర్వ‌కార‌ణం

Leave A Reply

Your Email Id will not be published!