YS Jagan : ప్ర‌జ‌ల‌ ఆశీర్వాదం కొండంత బ‌లం – జ‌గ‌న్

ఇచ్చిన మాట నిల‌బెట్టుకునే వంశం మాది

YS Jagan : కోట్లాది ప్ర‌జ‌ల ఆశీర్వాదం త‌న‌కు కొండంత బ‌లాన్ని ఇచ్చింద‌ని అన్నారు ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(YS Jagan). దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ సంద‌ర్బంగా ఎందుకు తాను పాద‌యాత్ర చేయాల్సి వ‌చ్చిందో చెప్పారు. వైఎస్సార్ ఆశ‌యాల సాధ‌న కోస‌మే ఈ పార్టీ పుట్టింద‌ని చెప్పారు. నా కోసం ఎంతో మంది వ‌చ్చారు.

తాను చేసిన అలుపెర‌గ‌ని పాద‌యాత్ర‌కు క‌నీవిని ఎరుగ‌ని రీతిలో స్వాగ‌తం ప‌లికారు. ఆపై జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్ర చ‌రిత్ర‌లో ఏ పార్టీకి లేనంత విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. మీరందించిన ప్రోత్సాహం ఎప్ప‌టికీ మ‌రిచి పోలేన‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan).

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 151 స్థానాలు క‌ట్ట‌బెట్టిన ఘ‌న‌త మీదేన‌ని అన్నారు. స‌భా ముఖంగా అశేష జ‌న‌వాహిని సాక్షిగా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాని సీఎం చెప్పారు.

ఈ 13 ఏళ్ల ప్ర‌యాణంలో ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నాం. మ‌రెన్నో ఇబ్బందుల‌ను అధిగమించామ‌ని అన్నారు జ‌గ‌న్ రెడ్డి. మూడేళ్ల కింద‌ట ఊహించ‌ని మెజారిటీ నాకు అందించారు.

అందుకే ప్ర‌తి ఒక్క‌రిని ఆదుకోవాల‌న్న‌దే నా ఆశ‌యం. ప్ర‌ధానంగా విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, మ‌హిళా సాధికార‌త‌, వ్య‌వ‌సాయ రంగానికి అధికా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు.

విచిత్రం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఏకంగా మేని ఫెస్టోనే మాయం చేసింద‌ని ఎద్దేవా చేశారు. ప‌ద‌వి అంటే అధికారం కాద‌ని ప్ర‌జ‌ల మీద మ‌మకారం ఉండాల‌ని తాము ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించామ‌ని చెప్పారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

Also Read : అన్ని దారులు వైసీపీ ప్లీన‌రీ వైపే

Leave A Reply

Your Email Id will not be published!