Perni Nani : ప‌వ‌న్ మాట‌ల్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌రు

ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాదు

Perni Nani : ఏపీ మంత్రి పేర్ని నాని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని పేర్కొన్నారు. ప‌వ‌న్ ఫుల్ టైమ్ పొలిటీషియ‌న్ కాద‌న్నారు.

ఆయ‌న ఫ‌క్తు అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. తాజాగా త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. అనంత‌రం మీడియాతో పేర్ని నాని(Perni Nani) మాట్లాడారు.

ఆయ‌న చెప్పిన ఏ మాట‌కు క‌ట్టుబ‌డిన దాఖ‌లాలు లేవ‌న్నారు. ఇంత‌కూ ఆయ‌న‌ను రాజ‌కీయ నాయ‌కుడ‌ని ఎవ‌రంటారంటూ ప్ర‌శ్నించారు. పేర్నినాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆయ‌న‌కంటూ స్వంత అభిప్రాయాలు, ఆలోచ‌న‌లు, విధానం లేద‌న్నారు. గ‌తంలో ప్ర‌పంచ పోరాట వీరుడు చెగువేరా ఫోటో పెట్టుకున్నారు. జ్యోతి బా పూలే ఫోటోలు పెట్టుకున్నాడ‌ని ఇప్పుడు చంద్ర‌బాబు ఫోటో పెట్టుకున్నాడంటూ ఎద్దేవా చేశారు.

ప‌వ‌న్ కు చంద్ర‌బాబు అంటే అభిమానం ఎందుకో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని డిమాండ్ చేశారు పేర్ని నాని. 2014లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రి ప‌ల్ల‌కీ మోశాడ‌ని ప్ర‌శ్నించారు.

మంత్రిగా ప‌ద‌వి చేప‌ట్టిన త‌న‌కు పూర్తి సంతృప్తి ఇచ్చింద‌న్నారు. ఈనెల 22న సున్నా వ‌డ్డీ ప‌థ‌కం కింద న‌గ‌దును విడుద‌ల చేస్తామ‌న్నారు పేర్ని నాని(Perni Nani).

సీఎం జ‌గ‌న్ రెడ్డి ఏ బాధ్య‌త అప్ప‌గించినా ప‌ని చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడున్న వారిలో కొంద‌రిని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కేబినెట్ స‌మావేశ‌మైంది. దీనికి సీఎం జ‌గ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త వ‌హించారు. మొత్తం 24 మంది త‌మ మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. ఈనెల 11న కొత్త కేబినెట్ కొలువు తీర‌నుంది.

Also Read : వ‌లంటీర్లకు వంద‌నం సేవ‌ల‌కు స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!