PM Kisan 2024: నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు విడుదల !

నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు విడుదల !

PM Kisan 2024 : రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. పీఎం కిసాన్‌ 17వ విడత నిధుల్ని మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 20వేల కోట్లు జమ కానున్నాయి.

PM Kisan 2024 Update

అలాగే పారా ఎక్స్‌టెన్షన్‌ వర్కర్లుగా పని చేసేందుకు శిక్షణ పొందిన 30వేల మందికిపైగా స్వయం సహాయ బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 732 కృషి విజ్ఞాన కేంద్రాలు, లక్షకుపైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతోసహా 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది.

Also Read : Minister Seethakka : నడిగడ్డ తండాలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క

Leave A Reply

Your Email Id will not be published!