PM Modi Kohli : కోహ్లీ అద్భుతం భార‌త్ విజ‌యం – మోదీ

టీమిండియాకు ప్ర‌ధాన‌మంత్రి కితాబు

PM Modi Kohli : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సూప‌ర్ 12లో భాగంగా జ‌రిగిన కీల‌క ఉత్కంఠ భ‌రిత పోరులో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ప్ర‌ధానంగా ఒకానొక ద‌శ‌లో ఓట‌మి పాల‌వుతుంద‌ని అనుకున్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా జూలు విదిల్చాడు భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.

కేవ‌లం 53 బంతులు ఎదుర్కొని 82 కీల‌క ప‌రుగులు చేసి జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి కోహ్లీపై(PM Modi Kohli) . సినీ రంగానికి చెందిన న‌టీన‌టులు పెద్ద ఎత్తున కొనియాడారు ర‌న్ మెషీన్ ను . ఇదిలా ఉండ‌గా దీపావ‌ళి పండుగ ముందే వ‌చ్చింద‌ని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇవాళ త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంద‌ని , దీపావ‌ళి పండుగ రోజును మ‌రింత ఆనందంగా జ‌రుపుకునేలా ఈ విజ‌యం ద‌క్కింద‌న్నారు. ప్ర‌ధానంగా విరాట్ కోహ్లీ ఆడిన తీరు అద్భుత‌మ‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అధికారిక ఖాతాలో కోహ్లీని ఆకాశానికి ఎత్తేశారు.

ఇలాంటి విజ‌యాలే దేశానికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తాయ‌ని తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి. ఇది చారిత్రాత్మ‌క గెలుపుగా గుర్తుండి పోతుంద‌న్నారు. విజ‌యానికి మార్గ నిర్దేశ‌నం చేసిన విరాట్ కోహ్లీని ప్ర‌ధాని ప్ర‌త్యేకంగా అభినందించారు. మీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు అని తెలిపారు మోదీ.

ఇదిలా ఉండ‌గా ఈ అద్భుత విజ‌యంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు విరాట్ కోహ్లీ. త‌న కెరీర్ లో ఇది మ‌రిచి పోలేని జ్ఞాప‌కం అని పేర్కొన్నాడు.

Also Read : నైతికంగా మాదే విజ‌యం – ర‌మీజ్ ర‌జా

Leave A Reply

Your Email Id will not be published!