Posani Krishna Murali : ‘పోసాని’కి జగన్ రెడ్డి నజరానా
పార్టీ కోసం పని చేసినందుకు అరుదైన గుర్తింపు
Posani Krishna Murali : ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళికి (Posani Krishna Murali) ఎట్టకేలకు గుర్తింపు లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వారిలో, టీడీపీని ఏకి పారేసిన వాళ్లల్లో ముందంజలో ఉన్నారు పోసాని కృష్ణ మురళి.
ఇప్పటికే మరో నటుడు ఆలీకి కూడా రాష్ట్ర స్థాయి కేబినెట్ హోదా కలిగిన పోస్టు అప్పగించారు సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. గురువారం కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు పార్టీ కోసం పని చేసినందుకు గాను పోసాని కృష్ణ మురళిని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తున్నట్లు వెల్లడించారు.
సీఎం జగన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రకటించింది. అపాయింట్ మెంట్ , ఇతర నియమ నిబంధనల వివరాలు ప్రత్యేకంగా వెల్లడిస్తామని ఉత్తర్వులలో పేర్కొంది. పోసాని కృష్ణ మురళి సినీ రంగంలోకి వచ్చాక తనదైన ముద్ర ఉండేలా కష్టపడ్డారు.
సినిమాలకు కథ, మాటల రచయితగా ప్రసిద్ది పొందారు. సినీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తర్వాత నటుడిగా, దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి వైసీపీకి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట నటుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించింది. ఈ ఇద్దరి పదవీ కాలం రెండు సంవత్సరాల పాటు ఉంటుంది.
Also Read : రూ.18 కోట్లతో ‘వివేక్’ ఫ్లాట్ కొనుగోలు