Prabhas Adipurush : ఆదిపురుష్‌ నుంచి బిగ్ అప్ డేట్.. ఈసారి ఫ్యాన్స్‌కు పండగే

Prabhas Adipurush : ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో ఒకటి ఆదిపురుష్.. ఓమ్ రౌత్ దర్శకత్వం లో వస్తున్నా ఈ చిత్రం మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 16 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

ఈ సినిమా టీజర్ విడుదలై అభిమానులు నుండి తీవ్రమైన విమర్శలను అందుకుంది . ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మొత్తం గ్రాఫిక్స్ వర్క్‌ను మార్చేస్తున్నారట. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదలకావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

రామాయణం ఆధారంగా రూపొందిన ఈ మూవీని రిట్రో ఫైల్స్ సంస్థతో కలిసి టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్(Prabhas Adipurush) , సీతగా కృతి సనన్, లంకేశ్‌గా సైఫ్ ఆలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు .ఇక లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఆదిపురుష్ నుండి ఒక అప్ డేట్ రానుందని తెలుస్తోంది. 

మరో వీడియో టీజర్‌ను వదలనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ జూన్ 16న ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా విడుదలవుతోంది.. ఇక మెరుగైన గ్రాఫిక్స్ కోసం ఈ ప్రాజెక్ట్‌పై ఆదిపురుష్ టీమ్ రీవర్క్ చేస్తుంది. దీని కోసం సుమారు 100-150 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వినికిడి.

రామాయణ కథా కావ్యానికి ఇది దృశ్య రూపంగా వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.

‘ఆదిపురుష్(Prabhas Adipurush) ’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారు దర్శకుడు ఓమ్ రౌత్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నాయి. రూ. 400 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు.

Also Read : ఐదు భాషల్లో పవన్ కళ్యాణ్ OG టైటిల్ రిజిష్టర్..

Leave A Reply

Your Email Id will not be published!