Ramiz Raja : ఇండియ‌న్ జ‌ర్న‌లిస్ట్ పై ర‌మీజ్ ర‌జా ఫైర్

పాక్ ఓట‌మిపై స‌మాధానం చెప్ప‌ని చైర్మ‌న్

Ramiz Raja : ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జాకు కోపం వ‌చ్చింది. యూఏఈ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ -2022లో శ్రీ‌లంక చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓట‌మి పాలైంది.

క‌ప్ కు సంబంధించి ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. ఇక హాట్ ఫేవ‌రేట్ గా ఉన్న భార‌త్ పోటీ ఇవ్వ‌కుండానే ఇంటి బాట ప‌ట్టింది. దీంతో పాకిస్తాన్ పై ఉన్న కోపంతో భార‌తీయ క్రికెట్ అభిమానులు గంప గుత్త‌గా మ‌రో దాయాది దేశ‌మైన ద్వీప దేశం శ్రీ‌లంక‌కు స‌పోర్ట్ చేశారు.

మ్యాచ్ అనంత‌రం పీసీబీ చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జాను(Ramiz Raja) మీడియా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించింది. ఇందులో భాగంగా భార‌తీయ జ‌ర్న‌లిస్ట్ వేసిన ప్ర‌శ్న‌కు త‌ల తిక్క‌గా స‌మాధానం ఇచ్చారు రమీజ్ ర‌జా. ఒక ర‌కంగా నోరు పారేసుకున్నాడు.

నువ్వు ఇండియ‌న్ వి క‌దా అందుకే అలా అడుగుతున్నావంటూ గ‌ద్దించాడు. అభిమానుల‌కు మీరు ఏం చెప్పాల‌ని అనుకుంటున్నారంటూ అడిగాడు జ‌ర్న‌లిస్ట్.

ఈ సంద‌ర్బంగా అత‌ను భార‌త దేశానికి చెందిన వ్య‌క్తినా అని ఆరా తీశాడు ర‌మీజ్ ర‌జా. అంతే కాదు ఈ రిజ‌ల్ట్ తో భార‌తీయ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉంటార‌ని ఎద్దేవా చేశాడు పీసీబీ చైర్మ‌న్(Ramiz Raja).

ఇదిలా ఉండ‌గా ఒక బాధ్య‌త క‌లిగిన ప‌ద‌విలో ఉన్న ర‌మీజ్ ర‌జా ఇలా జ‌ర్న‌లిస్టుపై నోరు పారేసు కోవ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Also Read : పాకిస్తాన్ ఓట‌మికి నేనే కార‌ణం 

Leave A Reply

Your Email Id will not be published!