Rahul Gandhi : దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్దం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టిన అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)  సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దేశం కోసం ప్రాణం ఇచ్చేందుకు తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశాడు. ఆయ‌న చేప‌ట్టిన యాత్ర మ‌హారాష్ట్ర‌లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన జోడో యాత్ర త‌మిళ‌నాడు,

కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల‌లో పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా యాత్ర‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. బీజేపీ విద్వేషాల‌ను ఆధారంగా చేసుకుని ఓట్ల రాజ‌కీయం చేస్తోందంటూ మండిప‌డ్డారు. తాను మోదీని, ఆయ‌న పాల‌న‌ను విమ‌ర్శించ ద‌ల్చు కోలేద‌న్నాడు.

కానీ దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ వ‌స్తున్నాన‌ని చెప్పాడు. కులం, ప్రాంతం, మ‌తం పేరుతో భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌నిగ‌ట్టుకుని ప్లాన్ గా ప్ర‌జ‌ల‌ను విభ‌జిస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. దేశంలో ప్రేమ‌, సౌభ్రాతృత్వాన్ని పంచాల‌ని, కానీ ద్వేషాన్ని కాద‌న్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

దేశంలోని యువ త‌రం అన్ని విప‌త్తుల ప‌ట్ల నిర్భ‌యంగా ఉండాల‌ని హెచ్చ‌రించాడు. దేశాన్ని విభ‌జించే ద్వేషాన్ని వ్యాప్తి చేయ‌డం మాను కోవాల‌ని పిలుపునిచ్చాడు అగ్ర‌నేత‌. మ‌హారాష్ట్ర‌లోని నాందేడ్ లో పాద‌యాత్ర సంద‌ర్భంగా ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

జీవితంలో దేనికీ భ‌యప‌డ‌కండి. నిర్బ‌యంగా ఉంటే ఎవ‌రినీ ద్వేషించ‌రు. మీ గుండెల్లోంచి భ‌యాన్ని తొల‌గించి దేశం కోసం ప‌ని చేయండి అని రాహుల్ గాంధీ పిలుపునిచ్చాడు.

Also Read : మోదీ పాల‌న‌లో అన‌కొండ‌లా అవినీతి – హ‌జారే

Leave A Reply

Your Email Id will not be published!