Revanth Reddy Gaddar : గ‌ద్ద‌ర్ మ‌ర‌ణం తెలంగాణ‌కు న‌ష్టం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Revanth Reddy Gaddar : ప్ర‌జా యుద్ద నౌక గద్ద‌ర్ ఇక లేడ‌న్న విష‌యం బాధ‌కు గురి చేస్తోంద‌ని పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy). రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో పాటు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీత‌క్క‌, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆస్ప‌త్రిలో గ‌ద్ద‌ర్ భౌతిక కాయాన్ని సంద‌ర్శించారు. యుద్ద నౌక‌కు నివాళులు అర్పించారు. ఆయ‌న లేర‌న్న వార్త త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy Gaddar Words

నీ గానం తెలంగాణ వేదమ‌ని, నీ గ‌జ్జె తెలంగాణ గ‌ర్జ‌న‌గా మారింద‌న్నారు. నీ గొంగ‌డి తెలంగాణ న‌డ‌వ‌డిగా , నీ గొంతుక ధిక్కార స్వ‌రంగా వినిపించిన ఘ‌న‌త నీకు మాత్ర‌మే ద‌క్కుతుంద‌న్నారు టీపీసీసీ చీఫ్‌. నీ రూపం తెలంగాణ స్వ‌రూపం, గ‌ద్ద‌రన్నా నువ్వు నా జీవిత కాల జ్ఞాప‌కం అని గుర్తు చేసుకున్నారు. నీ మ‌ర‌ణం నా గుండెకు శాశ్వ‌త గాయంగా మార్చేసింద‌న్నారు.

ఆప‌రేష‌న్ కంటే ముందు తాను క‌లిసి మాట్లాడాన‌ని అన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత అద్దంకి ద‌యాక‌ర్. కోడి కూర వండి పెట్టు వ‌చ్చి తింటాన‌ని అన్నారు. గ‌ద్ద‌ర‌న్న లేక పోవ‌డం అత్యంత బాధా క‌ర‌మ‌ని పేర్కొన్నారు. పూడ్చ‌లేని అగాధాన్ని మిగిల్చి వెళ్లి పోయ‌డ‌మ‌న్నారు.

Also Read : V Hanumantha Rao Gaddar : గ‌ద్ద‌రన్న‌ మృతి తీర‌ని లోటు

Leave A Reply

Your Email Id will not be published!