Revanth Reddy : మేడిగడ్డ మేడిపండు – రేవంత్
సీఎం కేసీఆర్ బాధ్యుడు
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. లక్షా 20 వేల కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి రాజ్యం ఏలుతోందని గతంలో తాము ఆరోపించామని అన్నారు. ఇందుకు సంబంధించి ఇవాళ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుంగి పోవడం అక్రమాలకు నిదర్శనమని మండిపడ్డారు.
Revanth Reddy Slams BRS Govt
టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. కుట్ర కోణం దాగి ఉందంటూ కొత్త నాటకానికి దారి తీశారంటూ బీఆర్ఎస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 21న సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చిందన్నారు. లక్ష్మీ బ్యారేజ్ కు సంబంధించి 19, 20, 21వ పిల్లర్స్ కుంగి పోయాయని ఆవేదన చెందారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టు ఇవాళ పనికి రాకుండా పోయిందని ఆరోపించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఎన్నికల వేళ ఏం చేయాలనే దానిపై బీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతలను, మీడియాను ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్ ను దర్శించేందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్.
మరో వైపు మేడిగడ్డ ప్రాజెక్టును మేడిపండుతో పోల్చారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : BJP Protest : బీజేపీ టికెట్ పై ఆగ్రహం