RGV Bandi Sanjay Son : బండి కొడుకుపై ఆర్జీవీ కామెంట్స్

భ‌గీర‌థుడి రూపంలో మ‌ళ్లీ పుట్టాడు

RGV Bandi Sanjay Son : తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి భ‌గ‌ర‌థ తోటి విద్యార్థిపై దాడికి దిగిన ఘ‌ట‌నకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ త‌రుణంలో ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా దాని గురించి స్ప‌దించే వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంకేం ఆయ‌న త‌న‌దైన స్టైల్ లో స్పందించారు. ఆయ‌న ఏది ట్వీట్ చేసిన దాని వెనుక ఓ నిగూఢ‌మైన అర్థం దాగి ఉంటుంది. ఇరాక్ ను గ‌డ‌గ‌డ‌లాడించిన నియంత స‌ద్దాం హుస్సేన్ ను మించిన త‌న కొడుకు ఉద‌య్ హుస్సేన్ కి కాలం చెల్లింద‌ని భ్ర‌మ ప‌డ్డాను..కానీ బండి సంజ‌య్ కొడుకు భ‌గీర‌థుడి రూపంలో మ‌ళ్లీ పుట్టాడు.

తండ్రిని మించిన కొడుకుగా క‌నిపిస్తున్నాడ‌ని పేర్కొన్నారు ఆర్జీవీ. అయితే బండి సంజ‌య్ కొడుకుని(RGV Bandi Sanjay Son) స‌ద్దాం హుస్సేన్ లాంటి నియంత కొడుకుతో పోల్చ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆర్జీవీ చేసిన పోస్ట్ పై నెటిజ‌న్లు భిన్నంగా స్పందించారు. మ‌రికొంద‌రు బీజేపీ, హిందువులు ఆర్జీవీ చేసిన పోలిక‌పై గుర్రుగా ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న కుమారుడి వీడియో ఘ‌ట‌న‌పై బండి సంజ‌య్ స్పందించారు. కొడుకు త‌ప్పు చేస్తే తానే పోలీసుల‌కు అప్ప‌గిస్తాన‌ని చెప్పారు. నాన్ బెయిల‌బుల్ కేసులు పెట్టి చిన్నారుల జీవితాల‌ను ఎలా నాశ‌నం చేస్తారంటూ ప్ర‌శ్నించారు. పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మ‌రో వైపు తాను త‌ప్పు చేసినందు వ‌ల్ల‌నే దాడి చేశార‌ని బాధితుడు చెప్ప‌డం విశేషం. ఈ వీడియోపై యూనివ‌ర్శిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Also Read : ఐశ్య‌ర్య రాయ్ కు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!