Samantha : స్విస్ టూర్ లో స‌మంత బిజీ

హైప‌ర్ అచీవ‌ర్ అన్న చిన్మ‌యి

Samantha : అటు సినిమాల్లో ఇటు వెబ్ సీరీస్ లో ఫుల్ బిజీగా ఉంటోంది న‌టి స‌మంత. నాగ్ చైత‌న్య‌తో విడాకులు తీసుకున్నాక లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు వివిధ ప్ర‌దేశాలు వెళ్ల‌డం అంటే స‌ర‌దా.

ఏ మాత్రం వీలు చిక్కినా సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తెలుగు, త‌మిళం, హిందీ సినీ రంగాల‌లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ గా మారారు.

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ బ‌న్నీ, ల‌వ్లీ గ‌ర్ల్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన పుష్ప రాజ్ పాన్ ఇండియా మూవీలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది స‌మంత‌(Samantha).

ఆమె న‌టించిన ఊ అంటావా మామ ఉ ఊ అంటావా అన్న సాంగ్ భార‌త దేశాన్ని ఊపేసింది. ఇంకా ఊపుతూనే ఉంది. ఈ స్పెష‌ల్ సాంగ్ ఎక్క‌డ చూసినా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీనికి కొరియోగ్ర‌ఫీ గ‌ణేశ్ ఆచార్య చేశాడు.

ఆ వీడియో కూడా నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ ఒక్క స్పెష‌ల్ పాట‌కు స‌మంత ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంద‌ని టాక్. ఇప్ప‌టికే పాన్ ఇండియాగా రిలీజ్ అయిన పుష్ప రాజ్ ఊహించ‌ని రీతిలో ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం స‌మంత స్విట్జ‌ర్లాండ్ టూర్ లో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. ఆమె చేసిన పోస్ట్ ను చూసి ప్ర‌ముఖ సింగ‌ర్ చిన్మ‌యి శ్రీ‌పాద హైప‌ర్ అచీవ‌ర్ అంటూ కితాబు ఇచ్చింది.

మ‌రికొంత మంది ఫ్యాన్స్ మాత్రం స‌మంత‌ను ప‌బ్ జి గ‌ర్ల్ గా అభివ‌ర్ణించారు. ప‌సుపు రంగు జాకెట్ ధ‌రించి హెల్మెట్ లో మంచుతో క‌ప్ప బ‌డిన మౌటానిన్ పై ఫోజులు ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది సమంత‌.

Also Read : కార్తీక్ సుబ్బ‌రాజ్ ‘మ‌హాన్’ రెడీ

Leave A Reply

Your Email Id will not be published!