కేరళ : ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును అభినందించారు. ఇదే సమయంలో తమ కేరళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ప్రశంసలు కురిపించాడు. ఒకానొక సమయంలో జట్టులో స్థానం కోల్పోయి, అనుకోకుండా వచ్చి దుమ్ము రేపడమే కాకుండా అరుదైన ఘనతను సాధించడం మామూలు విషయం కాదన్నాడు. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచు కోవడం కేరళ ప్రాంతానికి గర్వ కారణంగా ఉందన్నాడు. తను వ్యక్తిగత రికార్డుల కోసం ఏనాడూ ఆడలేదని , తను నిజమైన భారతీయ క్రికెటర్ అని నిరూపించు కున్నాడని తన ఆటతీరుతో అంటూ ప్రశంసలు కురిపించాడు.
టోర్నమెంట్లోని నిజమైన అద్భుత కథ ఏమిటంటే, సంజు సామ్సన్కు విధి రాసిన స్క్రిప్ట్ . 15వ స్థానానికి చేరుకోవడంలో కూడా సందేహం నుండి, కేవలం 5 మ్యాచ్ల నిడివి ఉన్న క్యాంపెయిన్తో టోర్నమెంట్ లో టాప్ లో నిలవడం మామూలు విషయం కాదన్నాడు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఒక తరానికి, టోర్నమెంట్లో నాకౌట్ అవుట్ దశల్లో ఒక భారతీయ ఆటగాడి గొప్ప మల్టీ ఇన్నింగ్స్ క్లచ్ ప్రదర్శన, ‘డెజర్ట్ స్టార్మ్’ను నిర్వచించే యుగం అని పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేట్ సచిన్ టెండూల్కర్ చేసిన ’98 షార్జా కప్ ఫైనల్స్లో సెంచరీ. దాదాపు 3 దశాబ్దాల తర్వాత, కష్ట సమయాల్లో తనకు లెజెండ్ నుండి నిరంతరం మార్గదర్శకత్వం ఉందని ప్రెజెంటేషన్లో చెప్పిన సంజు సామ్సన్ నిజంగా అభినందనీయుడని అన్నాడు సుకుమారన్.
సంజు..నీ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి చివరికి చూపించావు.. ఒక అభిమానిగా, ఈ 3 ఇన్నింగ్స్లు నీ అద్భుతమైన కెరీర్లోని మిగిలిన భాగాన్ని తీర్చిదిద్దుతాయని నేను ఆశిస్తున్నాను అని న్నాడు.
