Shreyas Iyer : కేకేఆర్ జ‌ట్టు ఎంపిక‌లో సిఇఓ జోక్యం

వెల్ల‌డించిన కెప్టెన్ శ్రేయ‌స్ అయ్యర్

Shreyas Iyer : కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ముంబై వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ పై భారీ తేడాతో విజ‌యం న‌మోదు చేసింది.

మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. జ‌ట్టు సెలెక్ష‌న్ లో కేకేఆర్ జ‌ట్టు సిఇఓ కూడా పాల్గొంటార‌ని, వారి అభీష్టం మేర‌కే ఎంపిక ఉంటుంద‌న్నాడు.

విచిత్రం ఏమిటంటే జ‌ట్టు కూర్పు అన్న‌ది హెడ్ కోచ్ , కెప్టెన్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ ఇక్క‌డ మాత్రం డిఫరెంట్. డాక్ట‌ర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడ‌మీలో ముంబై ఇండియ‌న్స్ ను 52 ప‌రుగుల తేడాతో ఓడించింది.

ఈ విజ‌యంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానానికి చేరుకుంది. జ‌ట్టును ఎంపిక చేయ‌డం అన్న‌ది క‌త్తి మీద సాము లాంటింద‌ని తెలిపాడు. ఇదే స‌మ‌యంలో తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించాడు.

ఇదే క్ర‌మంలో కేకేఆర్ సిఇఓ వెంకీ మైసూర్ కూడా పాల్గొంటున్నాడ‌ని చెప్పాడు శ్రేయ‌స్ అయ్య‌ర్(Shreyas Iyer). గ‌తంలో ఉన్న‌ట్టుగా లేదు ఐపీఎల్. ప్రతి మ్యాచ్ కీల‌కంగా మారింది. ఊహించ‌ని రీతిలో ఒత్తిళ్లు ఎక్కువై పోయాయి.

జ‌ట్టు గెలిస్తే ఆనందించ‌డం కంటే ఓడి పోయిన స‌మ‌యంలో తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డుతోందంటూ వాపోయాడు అయ్య‌ర్(Shreyas Iyer). అంతా బాగా ఆడిన‌ప్ప‌టికీ జ‌ట్టుకు సంబంధించి కొంత ల‌క్ కూడా కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నాడు.

బ్రెండ‌న్ మెక్ క‌ల్ల‌మ్ తో పాటు సిఇఓ నేను విజ‌యం కోసం తీవ్రంగా క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌ని తెలిపాడు శ్రేయ‌స్ అయ్య‌ర్. మిగ‌తా మ్యాచ్ లలో గెల‌వ గ‌లిగితే ప్లే ఆఫ్స్ కు చేరుకునేందుకు వీలు క‌లుగుతుంద‌న్నాడు.

Also Read : స‌మ ఉజ్జీల స‌మరం ఎవ‌రిదో విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!