Sidhu Moose Wala : సిద్దూ హ‌త్య కేసులో నిందితుడు టిను ప‌రార్

కీల‌క నిందితుడు దీపక్ అలియాస్ టిను

Sidhu Moose Wala : దేశ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ సింగ‌ర్ పేరు పొందిన పంజాబ్ కు చెందిన గాయ‌కుడు సిద్దూ మూసేవాలా(Sidhu Moose Wala) దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. గాయ‌కుడి హ‌త్య కేసులో కీల‌క నిందితుల‌ను ఇప్ప‌టికే పోలీసులు ప‌ట్టుకున్నారు. గ్యాంగ్ స్ట‌ర్స్ పాత్ర ఉంద‌ని గుర్తించారు.

ఇదే క్ర‌మంలో సిద్దూ మూసే వాలా హ‌త్య కేసులో కీల‌క నిందితుడిగా పేరున్న దీప‌క్ అలియాస్ టిను పోలీసు కస్ట‌డీ నుంచి త‌ప్పించుకున్నాడు. దీంతో ఈ వార్త క‌ల‌క‌లం రేపింది. గ‌త రాత్రి మాన్సా జిల్లాల్లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

మ‌రో కేసుకు సంబంధించి వారెంట్ పై గ్యాంగ్ స్ట‌ర్ దీప‌క్ ను సెంట్ర‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ – సీఐఏ రాత్రి స‌మ‌యంలో క‌పుర్తలా జైలు నుంచి మాన్సాకు త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు స‌మాచారం. దీప‌క్ ను ప్రైవేట్ వాహ‌నాంలో తీసుకు వెళుతుండ‌గా అర్ధ‌రాత్రి వేళ పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకున్నాడ‌ని పోలీసులు చెప్పారు.

ఇదిలా ఉండ‌గ‌గా పారి పోయిన నిందితుడిని ప‌ట్టుకునేందుకు పోలీస్ బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. కాగా సిద్దూ మూసేవాలా హ‌త్య కేసులో మ‌రో నిందితుడైన గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ కి దీప‌క్ స‌న్నిహితుడిగా పేరొందాడు. ఈ ఏడాది మే 29న పంజాబ్ లోని మాన్సా జిల్లాలో సింగ‌ర్ సిద్దూ మూసేవాలా దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు.

ఈ కేసుకు సంబంధించి మొత్తం 24 మంది నిందితుల‌ను పేర్కొంది సీబీఐ.

Also Read : షోపియాన్ లో ల‌ష్క‌ర్ ఉగ్ర‌వాది ఖ‌తం

Leave A Reply

Your Email Id will not be published!