Chandigarh Mayor Poll: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు !

Chandigarh Mayor Poll: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీజేపీ అభ్యర్ధి మనోజ్ సోంకర్ ఎన్నికల చెల్లదంటూ… ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాదు మేయర్ ఎన్నిక నిర్వహణలో రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు… ఆ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Chandigarh Mayor Poll Viral

చండీగఢ్(Chandigarh) మున్సిపల్ కార్పోరేషన్ కు జనవరి 30న మేయర్ ఎన్నిక నిర్వహించారు. అయితే కేవలం 16 కౌన్సిలర్లతో తగినంత సంఖ్యా బలం లేకపోయినప్పటికీ బీజేపీ మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ ను మేయర్ గా ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ ప్రకటించారు. మేయర్ ఎన్నికకు అవసరమై 20 కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓడిపోయినట్లు ప్రకటించారు. దీనితో ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి… వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్‌, ఆప్‌ నేతలు ఆరోపించారు. దీనితో ఆప్‌ కౌన్సిలర్ వేసిన పిటిషన్‌ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..?’ అంటూ మసీహ్‌ను ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు ’ అని సీజేఐ వెల్లడించారు. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. మాసిహ్‌ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ… లెక్కింపు వీడియోను మరోసారి ప్లే చేయమన్నారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్ వీడియో మొత్తం వేయాల్సిన పనిలేదు. అంతా వేస్తే… సాయంత్రం 5.45 గంటల వరకు ఇక్కడే ఉంటాం’ అంటూ రిటర్నింగ్ అధికారి మాసిహ్ కు సీజేఐ చురకలు అంటించారు.

Also Read : AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు ?

Leave A Reply

Your Email Id will not be published!