Suresh Raina : ఇక ఆడ‌లేనంటూ సురేష్ రైనా గుడ్ బై

అన్ని ఫార్మాట్ లకు దూర‌మ‌న్న క్రికెట‌ర్

Suresh Raina :  షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నాడు భార‌త క్రికెట‌ర్ సురేష్ రైనా. తాను క్రికెట్ నుంచి వైదొలుగుతున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. ఇది ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యం.

గ‌త కొంత కాలం నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్నాడు. అన్ని ర‌కాల క్రికెట్ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు వెల్ల‌డించాడు సురేష్ రైనా. నా రాష్ట్రం ఉత్త‌ర ప్ర‌దేశ్ కు, భార‌త దేశం త‌ర‌పున ఆడడాన్ని తాను గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు తెలిపాడు.

సాధ్య‌మైనంత మేర‌కు క్రికెట్ ను ఆస్వాదించాన‌ని, నా వంతు కీల‌క పాత్ర పోషించాన‌ని పేర్కొన్నాడు సురేష్ రైనా(Suresh Raina). ఎంతో మంది యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు.

ప్ర‌తి క్రికెట‌ర్ కు ఓ స‌మ‌యం అంటూ వ‌స్తుంది. ఎప్పుడో ఒక‌ప్పుడు ఆట నుంచి నిష్క్ర‌మించాల్సిందే. లేక పోతే అది ఆట‌గాడిగా గౌర‌వం అంటూ ఉండ‌ద‌ని పేర్కొన్నాడు రైనా.

జ‌ట్టు త‌ర‌పున ఆడుతున్న ప్ర‌తి సారి దేశం కోసం ఆడుతున్నాన్న సంతృప్తి త‌న‌కు ఎక్కువ‌గా సంతోషం క‌లిగించింద‌ని తెలిపాడు.

నా కెరీర్ లో ఈ స్థాయి వ‌ర‌కు వ‌చ్చేందుకు తోడ్పాటు అందించిన ఉత్త‌ర ప్ర‌దేశ్ క్రికెట్ అసోసియేష‌న్ కు, భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ)కి తాను ఎల్ల‌వేళ‌లా రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశాడు.

నా పేరు ఎక్కుగా ముడి ప‌డిఉన్న‌ది మాత్రం చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) అంటూ కితాబు ఇచ్చాడు. ఇదిలా ఉండ‌గా గ‌త 2020లోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.

కానీ ఐపీఎల్ లో ఆడుతూ వ‌చ్చాడు. ప్ర‌స్తుతం ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని ఆట‌గాడిగా మిగిలి పోయాడు రైనా.

Also Read : నేర్చు కోవ‌డంలో బాబ‌ర్ ఆజం ఫ‌స్ట్ – కోహ్లీ

Leave A Reply

Your Email Id will not be published!