Team India Changes : రెండో వ‌న్డేలో కీల‌క మార్పులు

అయ్య‌ర్ అవుట్ సిరాజ్ ఇన్

Team India Changes : స్వ‌దేశంలో ఆసిస్ తో జ‌రుగుతున్న వ‌న్డే సీరీస్ లో రెండో మ్యాచ్ లో కీల‌క మార్పు చోటు చేసుకుంది. తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం 1-0 తేడాతో ఆధిక్యంలో కొన‌సాగుతోంది. తొలి మ్యాచ్ ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగింది.

ఆసిస్ భారీ స్కోర్ సాధించింది. టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించ లేదు. త్వ‌ర‌గా వికెట్లు కోల్పోయింది. ఈ స‌మ‌యంలో సూర్య‌, కేఎల్ రాహుల్ ధాటిగా ఆడుతూ విజ‌యం సాధించేలా చేశారు.

Team India Changes Viral

తొలి వ‌న్డేలో హైద‌రాబాద్ స్పీడ్ స్టార్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చారు. ప్ర‌స్తుతం రాజ్ కోట్ లో రెండో వ‌న్డే జ‌ర‌గ‌నుంది. కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. జ‌స్ ప్రీత్ బుమ్రా రెస్ట్ తీసుకోవ‌డంతో అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జ‌ట్టు ప్ర‌సిద్ద్ కృష్ణ‌ను తీసుకుంది.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే శుభ్ మ‌న్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ , శ్రేయాస్ అయ్యార్, కేఎల్ రాహుల్(KL Rahul) , ఇషాన్ కిష‌న్ , సూర్య కుమార్ యాద‌వ్, ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్ , శార్దూల్ ఠాకూర్ , ష‌మీ, ప్ర‌సిద్ద్ కృష్ణ ఆడ‌నున్నారు. సిరాజ్ కు బ‌దులు కృష్ణ కీల‌కంగా మార‌నున్నాడు.

Also Read : Mynampally Hanumantha Rao : మల్కాజిగిరి నుండి పోటీ చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!