IND vs SL 2nd T20 : విక్ట‌రీపై క‌న్నేసిన టీమిండియా

ప‌రువు కోసం శ్రీ‌లంక పాకులాట

IND vs SL 2nd T20 : శ్రీ‌లంక‌పై ఫ‌స్ట్ వ‌న్డే గెలుపొంది ఫుల్ జోష్ మీదున్న భార‌త జ‌ట్టు రెండో టీ20 మ్యాచ్ పై క‌న్నేసింది. దుబాయి వేదిక‌గా జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఘోరంగా ఓట‌మి పాలై వెనుదిరిగింది.

ఇదే టోర్నీలో పాకిస్తాన్ చేతిలో ప‌రాజ‌యం పాలై ప‌రువు పోగొట్టుకుంది. ఫైన‌ల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి పోయి ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది న్యూజిలాండ్. అనంత‌రం భార‌త్ లో ప‌ర్య‌టించింది.

కానీ టీమిండియా (IND vs SL 2nd T20)చేతిలో ఓట‌మి పాలైంది. ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికా చేతిలో ప‌రువు పోగొట్టుకుంది. వెస్టిండీస్ తో సీరీస్ గెలిచింది. తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన టీ20 సీరీస్ లో ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో భారీ తేడాతో విజ‌యం సాధించింది.

ప్ర‌స్తుతం రెండో టీ20 మ్యాచ్ కు రెడీ అయ్యింది. విండీస్ ను అటు టీ20 ఇటు వ‌న్డే సీరీస్ ల‌ను గెలుపొంది మంచి ఊపు మీదుంది. ఇదే జోరుతో శ్రీ‌లంకను కూడా మ‌ట్టి క‌రిపించాల‌ని చూస్తోంది.

వ‌రుస‌గా 10 విజ‌యాలు న‌మోదు చేసింది టీమిండియా. 2016లో చివ‌రి సారిగా టీ20 మ్యాచ్ ఆడింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత శ్రీ‌లంక భార‌త్ లో ప‌ర్య‌టిస్తోంది. ఈ ఏడాది మెగా రిచ్ లీగ్ ఐపీఎల్ కొన‌సాగ‌నుంది.

అదే క్ర‌మంలో ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందు కోసం భార‌త జ‌ట్టు హెడ్ కోచ్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌యోగాలు చేయాల‌ని భావిస్తోంది.

ఇదే రికార్డు కంటిన్యూ చేయాలంటే వ‌రుస‌గా రెండు మ్యాచ్ లు గెలిస్తే టీమిండియా అత్య‌ధిక విజాయ‌లు న‌మోదు చేసిన టీమ్ గా గుర్తింపు పొందుతుంది.

Also Read : దూకుడు కాదు టైమింగ్ ముఖ్యం

Leave A Reply

Your Email Id will not be published!