TG News : తెలంగాణ లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త

TG News : మంచిగా ప్రవర్తించిన ఖైదీల విడుదలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆగస్టు 15న పచ్చజెండా ఉపనున్నారు. దీంతో 231 మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి మూడు రోజుల క్రితం సమర్పించిన జాబితాకు ఆయన అంగీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశమై సుమారు రెండు గంటల పాటు పలు అంశాలపై చర్చించారు.

TG News Update

మంత్రివర్గ విస్తరణ, అసెంబ్లీ సమావేశాలు, గవర్నర్ ఎమ్మెల్సీ కోటా, ఆగస్టు 15న ఖైదీల విడుదల, యూనివర్సిటీలకు వీసీల నియామకం, రాష్ట్ర విభజన తదితర అంశాలపై గవర్నర్, సీఎంల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఖైదీల విడుదలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అంటే ఎన్నో ఏళ్లుగా జైలులో ఉన్న 231 మందిని విడుదల చేయనున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం, ఖైదీలకు క్షమాభిక్ష మరియు ప్రాసిక్యూషన్ నుండి మినహాయింపు ఇచ్చే అధికారం గవర్నర్‌కు ఉంది.

Also Read : MLA KTR : దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!