Basanagouda Patil : క‌ర్ణాట‌క సీఎం పోస్టు విలువ 2,500 కోట్లు

ఆఫ‌ర్ ప్ర‌క‌టించార‌న్న బీజేపీ ఎమ్మెల్యే

Basanagouda Patil : ఈ దేశంలో రోజు రోజుకు రాజ‌కీయాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోతున్నాయి. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన వాళ్లు, స‌మాజానికి బాధ్య‌త వ‌హించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు గ‌తి త‌ప్పుతున్నారు. మ‌తి త‌ప్పి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

ఒకే దేశం ఒకే పౌర‌స‌త్వం అన్న నినాదం ఊపందుకుంది. ఇదే స‌మ‌యంలో కేంద్రంలో ప‌వ‌ర్ లో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.

ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు బీజేపీ అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క కు చెందిన బ‌స‌న‌గౌడ పాటిల్ (Basanagouda Patil)య‌త్నాల్. త‌న‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని ఆయ‌న కుండ బద్ద‌లు కొట్టారు.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 2, 500 కోట్లు నెట్ క్యాష్ ఇస్తే త‌న‌ను క‌ర్ణాట‌కకు ముఖ్య‌మంత్రిగా చేస్తామ‌ని చెప్పారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదే విష‌యంపై త‌న‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి తీసుకు వెళ‌తామ‌ని స‌ద‌రు మ‌ధ్య‌వ‌ర్తులు త‌న‌కు చెప్పార‌ని, ప్ర‌త్యేకంగా హామీ ఇచ్చార‌ని చెప్పారు బ‌స‌న‌గౌడ పాటిల్(Basanagouda Patil) య‌త్నాల్.

బెళ‌గావిలో నిర్వ‌హించిన ఓ ప్రోగ్రాంలో ఆయ‌న ఈ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అయితే ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఇలాంటి న‌కిలీ రాజ‌కీయ నాయ‌కుల ప‌ట్ల జాగ్ర‌త్త ఉండాల‌ని సూచించారు.

కాగా బ‌స‌న‌గౌడ పాటిల్ చేసిన కామెంట్స్ పై క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ స్పందించారు. ఈ విష‌యంపై ద‌ర్యాప్తు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం పాటిల్ చేసిన వ్యాఖ్య‌లు బీజేపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also Read : సీఎం స్టాలిన్ పాల‌న‌కు ఏడాది పూర్తి

Leave A Reply

Your Email Id will not be published!