Sachin Tendulkar : ఆ నాలుగు జ‌ట్లు సెమీస్ కు ఖాయం

స‌చిన్ టెండూల్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు

Sachin Tendulkar : ఆస్ట్రేలియా వేదికగా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో ప్ర‌తి మ్యాచ్ సాగుతుండ‌డం విశేషం. వంద‌ల కోట్ల వ్యాపారంతో ముడి ప‌డి ఉన్న ఈ మెగా రిచ్ టోర్నీలో ఇప్ప‌టికే పిల్ల‌కూన‌లుగా భావించిన జ‌ట్లు చుక్క‌లు చూపించింది. ప్ర‌ధానంగా స్కాట్లాండ్ చేతిలో వెస్టిండీస్ ఓడి పోగా న‌మీబియా చేతిలో ఆసియా క‌ప్ 2022 విజేత శ్రీ‌లంక చిత్తుగా ప‌రాజ‌యం పాలైంది.

ఇదిలా ఉండ‌గా ఏ జ‌ట్టు ఐసీసీ టైటిల్ గెలుస్తుంద‌నేది ఎవ‌రూ చెప్ప‌లేక పోతున్నారు. తాజాగా మాజీ భార‌త జ‌ట్టు కెప్టెన్ స‌చిన్ టెండూల్క‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. మంగ‌ళ‌వారం త‌న ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా స్పందించాడు టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ పై. త‌న‌కు భార‌త జ‌ట్టు టైటిల్ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉందన్నాడు.

ఇదే స‌మ‌యంలో సెమీ ఫైన‌ల్స్ కు ఏయే జ‌ట్లు వ‌స్తాయ‌నేది అంచ‌నా వేశాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తో పాటు భార‌త్ కూడా బ‌రిలో ఉండ‌నుంద‌ని జోష్యం చెప్పాడు. ప్ర‌స్తుతం టెండూల్క‌ర్(Sachin Tendulkar) చేసిన ఈ ప్రిడిక్ష‌న్ పై క‌ల‌క‌లం రేగింది. కొంత మంది స‌పోర్ట్ చేస్తుండ‌గా మ‌రికొంద‌రు భార‌త్ కు అంత సీన్ లేదంటున్నారు.

ఏది ఏమైనా టెండూల్క‌ర్ ఎవ‌రికి మ‌ద్ద‌తు ప‌లికాడ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండ‌గా భార‌త్ , పాకిస్తాన్ జట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 23న కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆసియా క‌ప్ లో ఇరు జ‌ట్లు చెరో మ్యాచ్ గెలుపొందాయి.

Also Read : తిప్పేసిన ష‌మీ త‌ల‌వంచిన ఆసిస్

Leave A Reply

Your Email Id will not be published!