Mahua Moitra : ‘మోదీ..షా’ మృగాళ్లను బయటకు పంపారు
టీఎంసీ ఎంపీ మహూవా మోయిత్రా కామెంట్
Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా(Mahua Moitra) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన గుజరాత్ బిల్కిస్ బానో సామూహిక రేప్, దారుణ హత్య కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది నిందితులను వారి ప్రవర్తన బాగుందంటూ గుజరాత్ బీజేపీ ప్రభుత్వం పంధ్రాగష్టు రోజు విడుదల చేసింది.
దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎనిమిది వేల మందికి పైగా మహిళలు సంతకాలతో కూడిన దావాను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టనుంది. వచ్చే నెల నవంబర్ కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది.
ఇదిలా ఉండగా బయటకు వచ్చిన నిందితులలో ఒకరైన రేపిస్ట్ గోవింద్ నాయ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హిందువులు రేప్ లు చేయరంటూ చెప్పాడు. తాము అసలు బిల్కిస్ బానోను ముట్టుకోలేదన్నాడు. జస్ట్ చూశామని అత్యాచారానికి పాల్పడలేదంటూ చిలుక పలుకులు పలికాడు.
మరో వైపు కేంద్ర మంత్రిగా సుషీల్ జోషి రేపిస్టులకు వత్తాసు పలికారు. వారిలో సత్ ప్రవర్తన వచ్చిందని అందుకే విడుదల చేశారంటూ కితాబు ఇచ్చాడు. దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఈ తరుణంలో మహూవా మోయిత్రా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షాలపై నిప్పులు చెరిగారు.
కావాలనే ఈ ఇద్దరు మృగాళ్లను విడుదల చేశారని, సమాజం మీదకు వదిలి వేశారని ఆరోపించారు. మరిన్ని రేప్ లు చేసేందుకు పర్మిషన్ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : మంత్రి సోమన్నపై సీఎం సీరియస్