Twitter Collapse Comment : సోషల్ మీడియాలో టాప్ లెవల్లో కొనసాగుతూ వస్తున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందా. అవుననే సమాధానం వస్తోంది టెక్ , సోషల్ మీడియా నిపుణుల నుంచి. రోజు రోజుకు ట్విట్టర్ లో ఏం జరుగుతోందనే ఆందోళన అన్నింటా వ్యక్తం అవుతోంది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన నాటి నుంచి నేటి దాకా ట్విట్టర్ ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎన్నో మైక్రో బ్లాగింగ్ సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ అవేవీ పిట్ట కూత (ట్విట్టర్ ) ముందు నిలవలేక పోయాయి.
అద్భుతమైన ప్లాట్ ఫారమ్ ఉండడం, ప్రతి ఒక్కరికీ వేదికగా ఏర్పడడం, ఆలోచనలు, అభిప్రాయాలు, సమస్త సమాజం, ప్రపంచం గురించినవన్నీ క్షణాల్లో ప్రత్యక్షం కావడంతో కోట్లాది మంది ట్విట్టర్ లో చేరి పోయారు.
ఒక రకంగా తమ జీవితంలో ఒక భాగంగా మార్చేసుకున్నారు. ప్రశ్నించడం, పరుగులు తీయించడం దగ్గరి నుంచి పౌర సమాజానికి ట్విట్టర్ ఒక ఆయువు పట్టుగా మారింది. ఇందులో చెడు కంటే ఎక్కువగా మంచే జరిగిందని చెప్పక తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దారుణాలు, యావత్ లోకం తలదించుకునే సన్నివేశాలు, సంఘటనలకు వేదికగా మారింది ట్విట్టర్. ఒక రకంగా చెప్పాలంటే అన్ని కులాలు, మతాలు, జాతులు, యావత్ మానవ సమూహం ట్విట్టర్ తో సహవాసం చెసిందని చెప్పవచ్చు.
ప్రశ్నించే వాళ్లకు, నిలదీసే వాళ్లకు, దట్టించిన మాటల తూటాలు పేల్చే వాళ్లకు, అన్నింటి కంటే పోరాడే వాళ్లకు వెన్నుదన్నుగా నిలిచింది ట్విట్టర్. ఇదే సమయంలో ఆరోపణలు లేక పోలేదు సంస్థకు సంబంధించి.
కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయో ఆనాటి నుంచి నేటి దాకా ట్విట్టర్ ను కోలుకోనీయకుండా చేశాయి. ఒకానొక దశలో ఆనాటి ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధం విధించింది ట్విట్టర్ .
ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్, గూగులు, యూట్యూబ్, వాట్సాప్ ఇలా ప్రతి సామాజిక మాధ్యమం ట్రంప్ కు షాక్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ప్రెసిడెంట్ తానే స్వంతంగా ఓ సోషల్ మీడియాను స్టార్ట్ చేశాడు.
ఇదే క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ టెస్లా సిఇఓ, చైర్మన్ , ప్రపంచ కుబేరుడిగా పేరొందిన ఎలాన్ మస్క్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట ట్విట్టర్ షేర్లు
కొన్నాడు. ఆపై ఏకంగా సంస్థకు ఎసరు పెట్టాడు. మొదట తనకు ఫేక్ ఖాతాల లిస్టు కావాలని కోరాడు. ఎంతకూ ఇవ్వక పోతే కోర్టుకు ఎక్కాడు.
కానీ ఏమైందో ఏమో కానీ చివరకు తాను చెప్పిన విధంగానే $44 బిలియన్లకు అంటే భారతీయ రూపాయల్లో రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ
తర్వాత టాప్ లో ఉన్న వారందరినీ సాగనంపాడు.
రోజుకో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ హోరెత్తిస్తున్నాడు. సంస్థలో ఉన్న 7,500 మంది సిబ్బందిలో చివరకు 40 శాతానికి తీసుకు వచ్చాడు. ఎవరైనా ఆఫీసులకు రావాల్సిందేనంటూ ఆదేశించాడు. రోజుకో నిర్ణయంతో ట్విట్టర్(Twitter Collapse) మార్కెట్ వాల్యూ పడి పోతోంది.
మరో వైపు మస్క్ కొనుగోలు వెనుక డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా కోట్లాది మంది ఆశల సౌధాలకు ప్రాణం పోస్తూ వస్తున్న
ట్విట్టర్ ఉన్నట్టుండి ఎగుడు దిగుడులకు లోనవడం చాలా మందిని విస్తు పోయేలా చేస్తోంది.
మరో వైపు సంస్థ నుంచి బయటకు వెళ్లిన వాళ్లు ఎలాన్ మస్క్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఏకంగా ట్విట్టర్ కు సమాధి కూడా కట్టేశారు. ఏది ఏమైనా
వ్యాపార పరంగా ఎంతో అనుభవం కలిగిన ఎలాన్ మస్క్ ఏం చేస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : ఉద్యోగులు ట్విట్టర్ కు సమాధి కట్టేశారు