Alan Sugar : యుకె బిలియ‌నీర్ షాకింగ్ కామెంట్స్

ప‌ని చేసే వ్య‌క్తుల‌పై అకార‌ణ నింద‌లు

Alan Sugar :  ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యంత పేరొందిన కుబేరుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు యుకె కు చెందిన అలాన్ షుగ‌ర్(Alan Sugar) . ప‌ని చేసే వారి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంటి వ‌ద్ద నుండి ప‌ని చేసే వారిపై నోరు పారేసుకున్నాడు. త‌న అభిప్రాయం ప్ర‌కారం ఆఫీసుల‌కు వెళ్లే వారి కంటే ఇంట్లో నుంచి ప‌ని చేసే వారికి త‌క్కువ వేత‌నం ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశాడు.

గుడ్ మార్నింగ్ బ్రిట‌న్ అనే టాక్ షోలో అలాన్ షుగ‌ర్ మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇంటి వ‌ద్ద నుంచి ప‌ని చేసే వారికి రాయితీలు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమైనా ఉందా అన్న ప్ర‌శ్న‌కు పై విధంగా ఆస‌క్తిక‌ర సమాధానం ఇచ్చారు అల‌న్ షుగ‌ర్(Alan Sugar) .

వ‌రుస ట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు. రిమోట్ కార్మికులు ప‌ని చేయాల్సిన స‌మ‌యంలో ఇంట్లో గోల్ఫ్ , టెన్నిస్ చూస్తున్నారంటూ మండిప‌డ్డారు. వారిని తిరిగి ర‌ప్పించండి లేదా తొల‌గించండి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

75 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఈ బిలియ‌నీర్ త‌క్కువ వేత‌నం ఇస్తే త‌ప్పేంటి అంటూ ప్ర‌శ్నించాడు. కార్మికుల‌ను సోమ‌రిత‌నం అంటూ అభివ‌ర్ణించారు.

న‌ర్సులు, వైద్యులు, క్లీన‌ర్లు, రెస్టారెంట్ సిబ్బంది, బిల్డ‌ర్లు , డెక‌రేట‌ర్లు, టాక్సీ, ట్ర‌క్ డ్రైవ‌ర్ల గురించి ప‌ని చేయ‌లేరంటూ నిందించారు. దీంతో నెటిజ‌న్లు షుగ‌ర్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న కామెంట్స్ ను వెన‌క్కి తీసుకోవాలంటూ కోరుతున్నారు.

Also Read : ప్ర‌భుత్వం వ్యాపారాలు నిర్వ‌హించొద్దు – భార్గ‌వ

Leave A Reply

Your Email Id will not be published!