Ambati Rambabu : అంబటిని అవమానించిన ముప్పళ్ల గ్రామస్తులు

అంబటిపై విరుచుకుపడ్డ సత్తెనపల్లి గ్రామస్తులు

Ambati Rambabu : సొంత నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకి మరో సారి సొంత పార్టీ కార్యకర్తలనుంచి నిరసనల సెగ తగిలింది. మొన్న సాయంత్రం సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పళ్లలో ‘వళి’ అనే యువకుడు మినీ లారీ ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది, అతడికి న్యాయం చేయాలంటూ మృతదేహంతో దాదాపు మూడు గంటలపాటు పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు, కుటుంబసభ్యులు, బంధువులు, మృతదేహంతో రాస్తారోకో చేయటం, సత్తెనపల్లి నర్సారావుపేట రోడ్డులో గంటల తరబడి కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది.

Ambati Rambabu Viral

పోలీసుల న్యాయం చేస్తామన్న హామీ మేరకు మూడు గంటల తరవాత బంధువులు ఆందోళన విరమించారు. అయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లిన తరవాత రాత్రి సమయంలో మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) స్థానిక నేతలతో కలిసి ‘వళి’ అనే కుర్రవాడి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్సించడానికి వెళ్లారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చేసినప్పుడు రానిమనిషి ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటూ కుటుంబ సభ్యులు బంధువులు కూడా అంబటి రాంబాబుని నిలదీశారు.

మృతిచెందిన ‘వళి’ అనే కుర్రవాడి కుటుంబ సభ్యులు కూడా వైసీపీ పార్టీకి చెందినవారు కావటంతో, మాతో ఆవేళ ఓట్లు వేయించి గెలిపించుకున్నావ్, రాలేకపోయావ్ అంటూ అక్కడున్న మహిళలు ముసలివాళ్ళు కూడా పెద్దఎత్తున అందరూ కూడా బూతులతో చెలరేగిపోవటం జరిగింది. దీంతో చేసేదేమీలేక మంత్రి అంబటి రాంబాబు పోలీసుల సాయంతో అక్కడినుంచి వెళ్లిపోవడం జరిగింది.

Also Read : TDP MP Kesineni Nani: కేశినేని నానికి చంద్రబాబు షాక్ ?

Leave A Reply

Your Email Id will not be published!