కోల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. ఫోర్లు , సిక్సర్లు కలిపి 90 పరుగులు చేశాడు. మిగతా సింగల్స్ రూపంగా వచ్చాయి. అంతే కాదు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 13 బంతులు మాత్రమే ఎదుర్కొని ఈ అరుదైన ఫీట్ సాధించాడు.
ఇప్పటి వరకు ఐపీఎల్ లో కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ , పాట్ కమిన్స్ పేరు మీద ఉండేది. ఆ రికార్డును బ్రేక్ చేశాడు యశస్వి జైస్వాల్. అరుదైన ఘనతను సాధించిన యంగ్ క్రికెటర్ పై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అతడిని వెంటనే భారత క్రికెట్ జట్టులోకి తీసుకోవాలని స్టార్ బౌలర్ బ్రెట్ లీ , మైఖేల్ వాన్ సూచించారు.
జైశ్వాల్ ఆడిన ఆట తీరుకు ఫిదా అయ్యారు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ. ఇక తన పేరు మీద ఉన్న ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేసినందుకు అభినందనలు తెలిపారు కేఎల్ రాహుల్. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడని , ఆకాశమే హద్దుగా చెలరేగడం శుభ సూచకమని పేర్కొన్నారు. మొత్తంగా ఐపీఎల్ లో యశస్వి జైస్వాల్ హాట్ టాపిక్ గా మారడం విశేషం.
