Virender Sehwag : కోహ్లీ..గంభీర్ పై సెహ్వాగ్ కామెంట్స్
ఆ ఇద్దరూ దిగ్గజ ఆటగాళ్లన్న మాజీ క్రికెటర్
Virender Sehwag : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా మైదానంలో చోటు చేసుకున్న ఘటనపై స్పందించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల కరచాలనం సందర్బంగా ఘర్షణ చోటు చేసుకుంది ప్రస్తుత భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ లక్నో మెంటార్ , బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.
దీనిపై దేశ వ్యాప్తంగా ఇంకా చర్చ కొనసాగుతోంది. ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు, క్రీడా స్పూర్తిని చాటాల్సిన వాళ్లు ఇలా చిల్లరగా ప్రవర్తిస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిపై మరొకరు తిట్టుకున్నారు. ఆపై కొట్లాడేందుకు సైతం సై అన్నారు. క్రీజులోనే ఉన్న కేఎల్ రాహుల్ వారిని పక్కకు తీసుకు వెళ్లాడు. వీరి ప్రవర్తన దేశం తల దించుకునేలా చేసిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ సందర్భంగా కోహ్లీ, గంభీర్ లపై వేటు వేయాలని డిమాండ్ పెరుగుతోంది. దీనిపై సీరియస్ గా స్పందించారు వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag). ఆ ఇద్దరూ అత్యంత ప్రభావితం కలిగిన ఆటగాళ్లని వాళ్లపై వేటు వేస్తే ఇబ్బంది ఎదురవుతుందన్నాడు. ప్రస్తుతం సెహ్వాగ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : హైదరాబాద్ గెలిచేనా ‘పాప’ నవ్వేనా