Bandi Sanjay : మేం మీకంటే పెద్ద గూండాలం – బండి

భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ కామెంట్స్

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్(Bandi Sanjay) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం డ‌బ్బు, అధికారంతో దాదాగిరి చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.

సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం అవినీతికి అడ్డాగా మారింద‌న్నారు. ఇదే సంద‌ర్భంలో త‌మ‌పై గులాబీ గూండాలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆపై తాము మీకంటే అతి పెద్ద గూండాలం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ కార్య‌క‌ర్త‌లు ప్రజ‌ల సంక్షేమం కోసం ప‌ని చేస్తున్న గూండాలుగా బండి సంజ‌య్ పేర్కొన్నారు.

త‌మ పార్టీ వారు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల కంటే పెద్ద ముదుర్ల‌ని కాగా ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తాము ప‌ని చేస్తున్నామ‌న్న సంగ‌తి గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

ఆయ‌న ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్ పై నిప్పులు కక్కారు. గ‌త కొంత కాలం నుంచీ తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

ఒక‌రిపై మ‌రొక‌రు హీట్ పెంచుతున్నారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో డ‌బ్బు, మ‌ద్యం, అవినీతి ఏరులై పారుతోంద‌న్నారు. తామే గ‌నుక రంగంలోకి దిగితే గులాబీ శ్రేణులు త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌న్నారు.

ప్ర‌జా సంగ్రామ‌యాత్రలో భాగంగా జ‌న‌గాంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసీఆర్ కుటుంబం అందినంత మేర దోచుకుంటున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : రూ. 1,000 కోట్ల లంచం అబ‌ద్దం

Leave A Reply

Your Email Id will not be published!