Rahul Priyanka Gandhi : వాట్ ఏ విక్ట‌రీ – రాహుల్..ప్రియాంక‌

పాకిస్తాన్ పై గెలుపొందిన భార‌త్ కు కంగ్రాట్స్

Rahul Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఆదివారం యూఏఈ వేదిక‌గా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ తో జ‌రిగిన కీల‌క పోరాటంలో భార‌త జ‌ట్టు 5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ సందర్భంగా ప‌లువురు అభినంద‌న‌ల‌తో ముంచెత్తుతున్నారు టీమిండియాను. తాజాగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. త‌మ ఆనందాన్ని పంచుకున్నారు.

టీమిండియా అన్ని ఫార్మాట్ ల‌లో రాణించ‌డాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎంత అద్భుత‌మైన మ్యాచ్ ఇది. నిజంగా క్రికెట్ అంటే ఇలా ఉంటుంద‌ని అనుకునేలా ఆట‌గాళ్లు ఆడారంటూ ప్ర‌శంసించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi) .

ఈ విజ‌యం భార‌త దేశాన్ని ఒక్క‌టి అయ్యేలా చేసింద‌ని పేర్కొన్నారు. చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగింది. ఇది అత్యంత ఉత్తేజ‌క‌ర‌మైన స‌న్నివేశం అంటూ కితాబు ఇచ్చారు.

ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాను అభినందించారు. మ‌రో వైపు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా అయితే తాను ఈ ఆనందాన్ని అద్భుతంగా ఆస్వాదించానంటూ పేర్కొన్నారు.

ఇలాంటి మ్యాచ్ లు చాలా అరుదుగా జ‌రుగుతుంటాయి. ఒక ర‌కంగా మ్యాచ్ లో ఉన్న ప‌వ‌ర్ ఏమిటో, దాని స‌త్తా ఏపాటిదో భార‌త్ , పాకిస్తాన్ జ‌ట్లు ఆడిన‌ప్పుడే తెలుస్తుంద‌ని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ వాద్రా.

Also Read : పాకిస్తాన్ పై టీమిండియా హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!