Earthquake Lucknow : యూపీలోని లక్నోలో భూకంపం
5.2 రిక్టర్ స్కేల్ పై కంపించిన భూమి
Earthquake Lucknow : ఊహించని రీతిలో భూమి కంపించడంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు యూపీలోని లక్నో వాసులు. శనివారం తెల్లవారుజామున 1.12 గంటలకు భూకంపం సంభవించింది.
భూకంపం లోతు భూమికి 82 కిలోమీటర్లుగా ఉంది. ఇదిలా ఉండగా రిక్టర్ స్కేల్ పై 5.2 గా నమోదైంది. ఇదిలా ఉండగా లక్నోకు ఉత్తర – ఈశాన్య ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్ ) వెల్లడించింది.
28.07 పొడవు 8125 లోతు 82 కిలోమీటర్ల లోతు గా ఉందని తెలిపింది. ఈ విషయాన్ని ఎన్సీఎస్ తన అధికారిక ఖాతా ట్విట్టర్ లో స్పష్టం చేసింది. మరో వైపు శుక్రవారం తెల్ల వారుజామున భూమి కంపించింది ఉత్తరాఖండ్ లో.
రిక్టర్ స్కేల్ పై 3.6 తీవ్రతతో భూకంపం(Earthquake Lucknow) సంభవించినట్లు పేర్కొంది. రాష్టర్ంలోని పితోరాఘర్ ప్రాంతంలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని స్పష్టం చేసింది ఎన్సీఎస్.
మరో వైపు రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతతో మరో భూకంపం జమ్మూ కాశ్మీర్ లో సంభవించిందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ లోని హాన్లీ గ్రామానికి దక్షిణ – నైరుతి దిశలో తాకినట్లు పేర్కొంది ఎన్సీఎస్. ఇదిలా ఉండగా లక్నోలో ఇవాళ చోటు చేసుకున్న భారీ భూకంపంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారు. ఎందుకు సంభవించిందనే దానిపై నేషనల్ సెంటర్ ఫర సిస్మాలజీ విచారణ ప్రారంభించింది.
భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇలాంటివి సంభవిస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
Also Read : ఎవరీ మునావర్ ఫరూకీ ఏమిటా కథ