PM Modi : మన్ కీ బాత్ కోసం సూచనలు ఇవ్వండి – మోదీ
దేశ ప్రజలను కోరిన ప్రధాన మంత్రి
PM Modi : దేశంలో ప్రధాన మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర మోదీ(PM Modi) ఇతర ప్రధానుల కంటే భిన్నంగా వెళుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలతో పాటు దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తులు, కష్టపడి పైకి వచ్చిన వారి గురించి మన్ కీ బాత్ పేరుతో రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. తాజాగా 91వ మన్ కీ బాత్ కోసం ఆలోచనలు, సూచనలు తెలియ చేయాలని కోరారు ప్రధాన మంత్రి మోదీ. మీకు సంబంధించిన ఇతివృత్తాలు, సమస్యలపై ఆలోచనలు పంచుకునేందుకు వేచి చూస్తున్నట్లు మైగవ్ వెల్లడించింది.
ఈనెల 31న నెల వారీ రేడియో కార్యక్రమం జరగనుంది. అంతే కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వెబ్ సైట్ లో లేదా 1800-11-7800 నంబర్ కు డయల్ చేయడం ద్వారా వారి సందేశాలను రికార్డ్ చేయవచ్చని తెలిపింది.
ఈ నెలలో జరిగే మన్ కీ బాత్ ను ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇందు కోసం మీ వద్ద ఏదైనా ప్రత్యేకమైన ఆలోచన అన్నది ఉంటే నాతో పంచుకోండి అని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ(PM Modi) కోరారు.
ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ దారా వెల్లడించారు. మీ ఆలోచనలు నాతో పంచుకోవాలని సూచించారు పీఎం. అంతే కాకుండా 1922 కి మిస్డ్ కాల్ కూడా ఇవ్వవచ్చని తెలిపింది.
గత నెలలో జరిగిన మన్ కీ బాత్ లో ఆనాటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. ప్రజాస్వామ్య స్పూర్తిని కోల్పోలేదన్నారు మోదీ.
Also Read : రూపాయి పతనం చిదంబరం ఆగ్రహం