K Annamalai Modi : మోడీ పోటీపై త‌మిళ‌నాడులో చ‌ర్చ

ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌న్న అన్నామ‌లై

K Annamalai Modi : త‌మిళ‌నాడు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ అన్నామ‌లై షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో యూపీలోని వార‌ణాసి నుంచి పోటీ చేసి గెలుపొందిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడు నుంచి పోటీ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని అన్నారు. శుక్ర‌వారం అన్నామ‌లై మీడియాతో మాట్లాడారు. మోదీ ఒక్క రాష్ట్రానికో లేదా ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమిత‌మైన వ్య‌క్తి కాద‌న్నారు.

ఆయ‌న భార‌త దేశానికి చెందిన వ్య‌క్తి అని స్ప‌ష్టం చేశారు అన్నామ‌లై. 2019లో యూపీలోని వార‌ణాసి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్ర‌జ‌ల మ‌ధ్య , ప్రాంతాల మ‌ధ్య ఉన్న అంత‌రాల‌ను ప్ర‌ధాన‌మంత్రి చెరిపి వేశార‌ని చెప్పారు అన్నామ‌లై(K Annamalai) . ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా న‌రేంద్ర మోడీ త‌మిళ‌నాడు నుంచి బ‌రి లోకి దిగుతార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ త‌రుణంలో వాటిని నిజం చేస్తూ బీజేపీ స్టేట్ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం అన్నామ‌లై చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. రాజ‌కీయాల‌కు అతీతంగా త‌మిళ‌నాడు ప్ర‌జలంతా మూకుమ్మ‌డిగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీని రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని బ‌లంగా కోరుకుంటున్నార‌ని చెప్పారు.

ఆయ‌న‌ను బ‌య‌టి వ్య‌క్తిగా భావించ‌డం లేద‌న్నారు. త‌మ‌లోని వ్య‌క్తిగా ప్రేమిస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు స్మితా ప్ర‌కాష్ తో జ‌రిగిన పోడ్ కాస్ట్ లో కె. అన్నామ‌లై మాట్లాడారు. త‌మిళ‌నాడులో ఎక్క‌డికి వెళ్లినా మోడీ గురించే చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు అన్నామ‌లై(K Annamalai).

Also Read : కేసీఆర్ నిర్వాకం రాజ్యాంగానికి అవ‌మానం

Leave A Reply

Your Email Id will not be published!