Manohar Gavaskar : భారత జట్టు మాజీ కెప్టెన్, కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన సఫారీ జట్టుతో ఆడుతున్న టీమిండియా ఆట తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా స్టార్ హిట్టర్ , వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ సరిగా ఆడలేక పోవడాన్ని తప్పు పట్టాడు. బంతి ఎలా వస్తుందోనన్న విషయం తెలియక పోతే ఎలా అని ప్రశ్నించాడు.
జట్టు మరింత సమర్థవంతంగా ఆడాలంటే ముందు కఠినతరమైన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు. అవతలి జట్టును తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు సన్నీ.
సౌతాఫ్రికాతో ఢీకొనే ముందు వారి బలా బలాలేమిటో ముందే తెలుసుకుని ఉండాలని పేర్కొన్నాడు. మొదటి టెస్టు గెలిచామన్న ఆనందం కంటే రెండో టెస్టులో పేలవమైన ఆట తీరు తనను సంతృప్తి పర్చ లేదన్నాడు.
సఫారీకి సంబంధించి ఇక్కడి మైదానాలు చాలా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నాడు. బంతులు పెద్ద ఎత్తున పైకి లేస్తాయని వాటిని తట్టుకుని నిలబడి స్వేచ్ఛగా పరుగులు చేసేలా తమను తాము తీర్చిదిద్దు కోవాలని సూచించారు.
లేక పోతే రాబోయే మ్యాచ్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు సునీల్ మనోహర్ గవాస్కర్(Manohar Gavaskar ). ఇదే సమయంలో రిషబ్ పంత్ సైతం బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలన్నాడు.
అనవసరమైన బంతులను ఆడడం మానుకోవాలని సూచించాడు. పనిలో పనిగా భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు కూడా కొన్ని సూచనలు చేశాడు సునీల్ గవాస్కర్.
ఆటగాళ్ల పట్ల ప్రేమ కంటే కాస్తా కఠినంగా ఉండాలన్నాడు. లేక పోతే ఆశించిన ఫలితాలు రావన్నాడు.
Also Read : వరల్డ్ కప్ జట్టు కెప్టన్ గా మిథాలీ రాజ్