India vs Ireland : ఐర్లాండ్ పై ఇండియా అదుర్స్

భారీ తేడాతో ఘ‌న విజ‌యం

India vs Ireland : భార‌త సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఓ వైపు ద‌క్షిణాఫ్రికా దెబ్బ‌కు ఓట‌మి పాలై నానా తంటాలు ప‌డుతుంటే మ‌రో వైపు అండ‌ర్ -19 జ‌ట్టు ఆట‌గాళ్లు మాత్రం దుమ్ము రేపుతున్నారు.

విండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుత విజ‌యాలు న‌మోదు చేస్తోంది మ‌న జ‌ట్టు. తాజాగా ట్రినిడాడ్ వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో కంగా ఐర్లాండ్ టీమ్(India vs Ireland) పై 174 ప‌రుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది.

ఈ ఒక్క అద్భుత విజ‌యంతో టీమిండియా క్వార్ట‌ర్ ఫైన‌ల్ బెర్త్ ను క‌న్ ఫ‌ర్మ్ చేసేఉకుంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ గెలిచిన భార‌త జ‌ట్టు(India vs Ireland) ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 307 ప‌రుగుల బిగ్ స్కోర్ చేసింది. టీం ఆట‌గాళ్లు హర్నూర్ సింగ్ దుమ్ము రేపాడు ఏకంగా 88 ప‌రుగులు చేసి దంచి కొట్టాడు. ఇక ర‌ఘు వంశీ 79 ప‌రుగులు సాధించాడు.

ఎక్క‌డా త‌గ్గ‌లేదు వీరిద్ద‌రూ. ఐర్లాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. దీంతో భారీ స్కోర్ సాధించిన భార‌త జ‌ట్టు నిర్దేశించిన 308 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఐర్లాండ్ కేవ‌లం 39 ఓవ‌ర్ల‌కే 133 ప‌రుగులు చేసి చాప చుట్టేసింది.

భార‌త యువ ఆటగాళ్ల బంతుల దెబ్బ‌కు ఐర్లాండ్ కూన‌లు విల‌విల లాడారు. ఎక్క‌డా ప‌రుగులు చేయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశారు మ‌నోళ్లు. భార‌త బౌల‌ర్ల‌లో సంగ్వాన్, గౌత‌మ్ , తంబే త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఇక విక్కీ ఓస్వాల్ , ర‌వి కుమార్ , రాజ‌వ‌ర్ద‌న్ చెరో వికెట్ కూల్చారు. మొత్తంగా భార‌త జూనియ‌ర్ టీం స‌త్తా చాటుతోంది. భార‌త్ పేరు నిల‌బెడుతోంది.

Also Read : ఆడ లేనంటున్న సానియా

Leave A Reply

Your Email Id will not be published!