Aadavaallu Meeku Joharlu : ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ సూప‌ర్

టీజ‌ర్ కు పాజిటివ్ రెస్పాన్స్

Aadavaallu Meeku Joharlu : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ఆడ‌వాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Joharlu)మూవీ ఆక‌ట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్ విడుద‌లైంది. దీనికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఈ చిత్రంలో యంగ్ హీరో శ‌ర్వానంద్ , ల‌వ్లీ గ‌ర్ల్ రష్మిక మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించింది. ఈ టీజ‌ర్ అన్ని వ‌ర్గాల వారిని ఆక‌ట్టుకునేలా ఉంది. ప‌ర్ఫెక్ట్ గా ఫ్యామిలీ, ఎంట‌ర్ టైన్మెంట్ ఉండేలా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు.

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ మీద సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు ఈ మూవీని. పుష్ప రాజ్ మూవీకి దుమ్ము లేపిన మ్యూజిక్ ఇచ్చిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు చిత్రాన్ని ఈనెల 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్రం మూవీ మేక‌ర్స్. ఈ సినిమాకు సంబంధించి ద‌ర్శ‌క‌త్వంతో పాటు ర‌చ‌న కూడా కిషోర్ తిరుమ‌ల చేశారు.

సినిమాను చాలా రిచ్ గా చిత్రీక‌రించాడు. ఇందులో శ‌ర్వానంద్, ర‌ష్మిక తో పాటు రాధిక శ‌ర‌త్ కుమార్ , ఊర్వ‌శి, ఖుష్బు ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించారు. దీనిని పూర్తిగా రొమాంటిక్ , కుటుంబ క‌థా చిత్రంగా మ‌లిచాడు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల కిషోర్ వెంక‌టేశ్ , నిత్యా మీనన్ ల‌తో 2016లో ప్లాన్ చేశాడు. కానీ అది వ‌ర్క‌వుట్ కాలేదు. వారి స్థానంలో శ‌ర్వానంద్, ర‌ష్మిక‌ను తీసుకుని దీనిని తెర‌కెక్కించాడు.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు మూవీ మొత్తం హైద‌రాబాద్, రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో చిత్రం షూటింగ్ జ‌రుపుకుంది. మొత్తంగా పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డం కొంత శుభ‌వార్తేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : మోహన్‌బాబుతో పేర్ని నాని భేటీ

Leave A Reply

Your Email Id will not be published!