Amit Shah: కూలిన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది – హోం మంత్రి అమిత్‌ షా

కూలిన విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది - హోం మంత్రి అమిత్‌ షా

Amit Shah : అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన దుర్ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌ లో ఆస్పత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Amit Shah Shocking Comments

‘‘ఎయిరిండియా-171 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మరణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. విమానంలో 230మంది ప్రయాణికులు ఉన్నారు. 12మంది సిబ్బంది ఉన్నారు. విమాన ప్రమాదం నుంచి ఒకరు క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. అతడిని కలిశాను. మృతుల గురించి తెలుసుకొనేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేస్తున్నాం. డీఎన్‌ఏ టెస్టులు చేశాకే మృతుల గురించి ప్రకటిస్తాం’’ అన్నారు.

‘‘ఘటన జరిగిన వెంటనే గుజరాత్‌ సర్కార్‌ వేగంగా స్పందించింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాను. ప్రమాద సమయంలో విమానంలో 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉంది. విమానం పేలిన వెంటనే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో ఎవరినీ కాపాడే పరిస్థితిలేకుండా పోయింది’’ అని అమిత్‌ షా వివరించారు.

Also Read : Air India Plane Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి

Leave A Reply

Your Email Id will not be published!