Amit Shah Visit : లోక్ సభ ఎన్నికలకు దూకుడు పెంచిన బీజేపీ..తెలంగాణకు రాబోతున్న అమిత్ షా

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందే, ముందస్తుగా ఎన్నికల మైలేజీని పొందేందుకు 'విజయ్ సంకల్ప యాత్ర' ప్రారంభించింది.

Amit Shah : పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో తన స్పీడుని ఉధృతం చేసింది. 10 రోజుల విజ‌య్ సంక‌ల్ప యాత్ర కొన‌సాగుతున్న స‌మ‌యంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం ఇప్ప‌టికే తెలంగాణ‌లో తొలి విడత ప్ర‌చారం మొద‌లైంది. నాలుగు ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు ఏకకాలంలో జెండాలు చేతబూని ప్రజల వద్దకు పాదయాత్ర ప్రారంభించారు. అయితే ఈ నెల 24న హైదరాబాద్‌లో జరగనున్న విజయ్ సంకల్ప్ యాత్రకు హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హాజరుకానున్నారు. అమిత్ షా రాకతో విజయ్ సంకల్ప్ యాత్ర కార్యక్రమం ఊపందుకోనుంది. అయితే తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. అయితే తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదు.

Amit Shah Visit Telangana

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యమైన స్ట్రైక్ రేట్‌తో, బీజేపీ(BJP) తన ఓట్ షేర్‌ను దాదాపు 7 పాయింట్లు మెరుగుపరుచుకుంది. లోక్ సబా ఎన్నికల్లో ఓటర్ల మద్దతు విషయంలో ప్రత్యర్థి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ చాలా ముందుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90% ఓట్లతో 8 అసెంబ్లీ సెట్లను సాధించింది. ఇదే జోరును ఉపయోగించి మరిన్ని లోక్‌సభ స్థానాలను గెలుచుకోవాలని వారు భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడానికి ముందే, ముందస్తుగా ఎన్నికల మైలేజీని పొందేందుకు ‘విజయ్ సంకల్ప యాత్ర’ ప్రారంభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు బిఎల్ శర్మ, పురుషోత్తం రూపాలతోపాటు పార్టీకి చెందిన ఇతర ప్రముఖ జాతీయ నాయకులు ‘విజయ్ సంకల్ప యాత్ర’లను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభజించి, ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి నాయకత్వం వహించేందుకు ఒక్కో క్లస్టర్‌లో ‘స్టార్ లీడర్‌’ని నియమించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర ఆధీనంలో ఉన్న కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ ఇటీవల నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పటికీ పెద్దగా కార్యాచరణ జరగలేదు. పార్లమెంటు కూడా అంత యాక్టివ్‌గా లేదు. అయితే బీజేపీ మాత్రం పక్కా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. అయోధ్య రామమందిరం వంటి అంశాలను తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

Also Read : PNS Ghazi: విశాఖ తీరంలో పాక్‌ సబ్ మెరైన్ ‘ఘాజీ’ శకలాలు !

Leave A Reply

Your Email Id will not be published!