MK Stalin : డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్దమయ్యారు. ఓ వైపు దేశంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, కావాలని బీజేపీయేతర రాష్ట్రాలను, వ్యక్తులను, నాయకులను, సంస్థలను టార్గెట్ చేస్తోందంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది.
కాగా ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. అయినా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంథిల్ బాలాజీ సిటీ కోర్టును ఆశ్రయించారు. కానీ మంత్రికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. జూన్ 23 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.
ఈ తరుణంలో సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక ప్రకటన చేశారు. తాము కోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఏకపక్ష విధానాలను వ్యతిరేకిస్తూ స్టాలిన్ నిప్పులు చెరిగారు. ఈ మేరకు తమిళనాడు లోని కోయంబత్తూరులో వివిధ పార్టీలకు చెందిన నేతలతో కలిసి అఖిలపక్షం సమావేశం నిర్వహించారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడంపై తమ నిరసనను తెలిపినందుకు, తమకు మద్దతు తెలిపినందుకు ప్రోగ్రెసివ్ అలయన్స్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం ఎంకే స్టాలిన్.
Also Read : Swachha Badi KTR : తెలంగాణ అంతటా ‘స్వచ్చ బడి ‘