Anurag Thakur : ఫ్యామిలీ కోసమే రాహుల్ యాత్ర
అనురాగ్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్
Anurag Thakur : కరోనా భూతం మరోసారి జనాన్ని భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే చైనాలో శవాల గుట్టలుగా పేరుకు పోయాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అన్ని రాష్ట్రాలు కోవిడ్ రూల్స్ పాటించాలని స్పష్టం చేశారు. ఈ తరుణంలో కేంద్ర మంత్రి రాహుల్ గాంధీకి లేఖ రాశారు. యాత్రను వీలైతే నిలిపి వేసుకోవాలంటూ సూచించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా తప్పు పట్టింది.
ఈ సందర్భంగా కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) నిప్పులు చెరిగారు రాహుల్ గాంధీపై. అవినీతి పరులకు సపోర్ట్ గా ఉండేందుకే ఆయన యాత్ర చేపట్టారని మండిపడ్డారు. తన ఫ్యామిలీని కాపాడు కోవడం కోసమే చిలుక పలుకులు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే కరోనా కేసులు పెరుగుతున్నాయని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ మాత్రం తెలుసు కోకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు అనురాగ్ ఠాకూర్. అసలు రాహుల్ గాంధీతో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం, ఇతర మంత్రులు కోవిడ్ టెస్టులు చేయించు కున్నారా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
కాంగ్రెస్ పూర్తిగా కుటుంబ పార్టీగా మారి పోయిందన్నారు. అది పార్టీగా మరిచి పోయిందని ఎద్దేవా చేశారు అనురాగ్ ఠాకూర్.
Also Read : ద్వేషం వేగం కంటే విస్తరిస్తోంది – రాహుల్