Virat Kohli Anushka Visit : ఉజ్జ‌యిని గుడిలో కోహ్లీ..అనుష్క‌

ద‌ర్శించుకున్న క్రికెట‌ర్..న‌టి

Virat Kohli Anushka Visit : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి శ‌నివారం ఉజ్జ‌యిని లోని మ‌హాకాళేశ్వ‌ర ఆల‌యాన్ని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో ఆస్ట్రేలియాతో 4వ టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇండోర్ లో మూడో టెస్టు ముగిసింది. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యినిలో ఉన్న ఈ ఆల‌యం దేశంలోనే అత్యంత పేరు పొందింది. గ‌తంలో కూడా కోహ్లీ దంప‌తులు ఈ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. మొక్కులు తీర్చుకున్నారు.

ఈ స్టార్ క్రికెట‌ర్ కు భ‌క్తి కూడా ఎక్కువే. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు క‌లిగి ఉన్న ఈ క్రికెట‌ర్ ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. ఈ మ‌ధ్య ఫామ్ లోకి వ‌చ్చిన కోహ్లీ మ‌రోసారి విఫ‌లం కావ‌డం కొంత ఇబ్బంది క‌లిగిస్తున్నా ఎందుక‌నో మ‌రోసారి మ‌హా కాళేశ్వ‌ర గుడిని సంద‌ర్శించు కోవడం విస్తు పోయేలా చేసింది. మైదానంలో ఆడేందుకు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇచ్చే విరాట్ కోహ్లీ బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించ‌డు. ఆయ‌న‌కు ఫ్యామిలీ అంటే అభిమానం.

త‌న కూతురు పేరుతో ఇటీవ‌లే ఓ ఫౌండేష‌న్ కూడా ఏర్పాటు చేశారు. వంద‌ల కోట్ల ఆదాయం క‌లిగిన ఈ క్రికెట్ కు అనుష్క శ‌ర్మ అంటే పంచ ప్రాణం. త‌న కూతురికి విరుష్క అని కూడా పేరు పెట్టుకున్నారు ఈ దంప‌తులు. ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ(Virat Kohli Anushka Visit)  క‌లిసి సంద‌ర్శించిన ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎంతైనా క్రికెట‌ర్, సినీ యాక్ట‌ర్ కావ‌డంతో ఆ రేంజ్ వేరేగా ఉంటుంది.

Also Read : డ‌బ్ల్యూపీఎల్ లో తార‌ల సంద‌డి

Leave A Reply

Your Email Id will not be published!