AP Trains Stop : 14 రైళ్లు ర‌ద్దు 5 దారి మ‌ళ్లింపు

ప్ర‌కటించిన రైల్వే శాఖ

AP Trains Stop : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – రాష్ట్రంలో చోటు చేసుకున్న రైలు ఘ‌ట‌న‌ను పుర‌స్క‌రించుకుని ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది రైల్వే శాఖ‌. ఏపీ(AP)లో జ‌ర్నీ చేసే ప‌లు రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. మ‌రికొన్ని రైళ్ల‌ను దారి మ‌ళ్లిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇందులో భాగంగా మొత్తం 14 రైళ్ల‌ను ర‌ద్దు చేశామ‌ని, ఐదు రైళ్ల‌ను వేరే వైపు మ‌ళ్లించిన‌ట్లు తెలిపింది.

AP Trains Stop Incident Viral

వివ‌రాలు ఇలా ఉన్నాయి. రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్, రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ , రాయ్‌పూర్ నుండి – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్ , విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి.

ఇక పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ , పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ , రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్ , విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్ ట్రైన్ ఉంది.

ఇక విశాఖపట్నం నుండి – విశాఖపట్నం- గుణుపూర్ స్పెషల్ ట్రైన్ , గుణుపూర్ నుండి – గుణుపూర్-విశాఖపట్నం స్పెషల్, విశాఖపట్నం నుండి – విశాఖపట్నం- కోర్బా ఎక్స్‌ప్రెస్, పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్, విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-పారాదీప్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయ‌ని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యాన్ని ప్ర‌యాణీకులు గ‌మ‌నించాల‌ని కోరింది.

Also Read : G kishan Reddy : ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!