Varun Gandhi : ప‌రిష్క‌రించేంత దాకా కేంద్రాన్ని ప్ర‌శ్నిస్తా

మోదీ ప్ర‌భుత్వంపై వ‌రుణ్ గాంధీ ఫైర్

Varun Gandhi : బార‌తీయ జన‌తా పార్టీ ఎంపీ వ‌రుణ్ గాంధీ మ‌రోసారి నిప్పులు చెరిగారు. ఆయ‌న గ‌త కొంత కాలంగా మోదీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వం ఎందుకు విఫ‌లం అవుతోందంటూ నిల‌దీస్తున్నారు.

ఒక ర‌కంగా ఆయ‌న పార్టీలో ఉంటూనే ధిక్కార స్వరాన్ని పెంచుతూ వ‌చ్చారు. తాజాగా దేశంలో ల‌క్ష‌లాదిగా జాబ్స్ పేరుకు పోయాయ‌ని భ‌ర్తీ ఎందుకు చేయ‌డం లేదో దేశ ప్ర‌జ‌ల‌కు మోదీ జ‌వాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

తాను ప్ర‌జల కోసం గ‌ళం విప్పుతూనే ఉంటాన‌ని, తాను ఆప‌న‌ని స్ప‌ష్టం చేశారు. ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం ఆందోళ‌న‌కు గురి చేస్తోంద‌ని , నిరుద్యోగం తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింద‌ని మండిప‌డ్డారు.

పిల్ల‌లు, యువ‌తకు గౌర‌వం ద‌క్కేంత వ‌ర‌కు తాను ప్ర‌శ్నిస్తూనే, నిల‌దీస్తూనే ఉంటాన‌ని పేర్కొన్నారు వ‌రుణ్ గాంధీ(Varun Gandhi) . అలాంటి భార‌త దేశం కోసం తాను ప‌ని చేస్తున్నాన‌ని చెప్పారు.

స‌హాయం కోసం ఎవ‌రూ త‌ల వంచాల్సిన ప‌ని లేద‌న్నారు. పేరుకు పోయిన నిరుద్యోగం, అవినీతి, ద్ర‌వ్యోల్బ‌ణం పై త‌న పొరాటం కంటిన్యూగా కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు.

అవి అంతం అయ్యే దాకా తాను నిద్ర పోన‌ని చెప్పారు. ఈ దేశంలో ఉపాధి మానేసి , పిల్ల‌ల‌కు ఉద్యోగాలు రానంత వ‌ర‌కు నా పోరు ఆగ‌దన్నారు. అవినీతి అంతులేని రీతిలో పెరిగి పోయింద‌న్నారు.

త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ పై విధంగా మోదీ స‌ర్కార్ ను ఏకి పారేశారు.

Also Read : మ‌రిన్ని పోస్టుల‌కు ‘మాన్’ గ్రీన్ సిగ్న‌ల్

Leave A Reply

Your Email Id will not be published!