Assam CM : నోరు జారిన సీఎం అమిత్ షానే పీఎం

హిమంత బిశ్వ శ‌ర్మ సంచ‌ల‌న కామెంట్స్

Assam CM : అస్సాం సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ నోరు జారారు. బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న శ‌ర్మ భార‌త దేశానికి త‌దుప‌రి ప్ర‌ధాన మంత్రి అమిత్ చంద్ర షానేన‌ని జోష్యం చెప్పారు.

బ‌య‌ట‌కు అలా అని ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకున్న సీఎం(Assam CM) స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోయింది. ప్ర‌స్తుం సీఎం చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థ‌లైన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్, విశ్వ హిందూ ప‌రిష‌త్, భ‌జ‌రంగ్ ద‌ళ్, ఏబీవీపీ, యువ మోర్చా ల‌లో అమిత్ షా, మోదీ టాపిక్ వ్య‌వ‌హారం కీల‌కంగా మారింది.

బ‌హిరంగ స‌భ‌లో సీఎం సాక్షాత్తూ ఈ కామెంట్స్ చేశారు. బిశ్వ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అవే ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. దీంతో బీజేపీ సీనియ‌ర్ నేత రంగంలోకి దిగాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను భార‌త ప్ర‌ధానిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని హోం శాఖ మంత్రిగా సంబోధించ‌డం తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేసింది. సీఎం చేసిన వ్యాఖ్య‌ల‌తో స‌భ‌కు వ‌చ్చిన వేలాది మంది కాషాయ శ్రేణులు విస్తు పోయారు.

ఇంత‌కూ ఏం మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారా లేక సోయి త‌ప్పి మాట్లాడుతున్నారా అంటూ ఆ పార్టీకి చెందిన క‌స్సుమ‌న్నారు.

అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యింద‌ని, కావాల‌ని అన‌లేద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ఓ సీనియ‌ర్ నాయ‌కుడు. దీంతో అందివ‌చ్చిన ఛాన్స్ ను కాంగ్రెస్ ఉప‌యోగించుకుంది.

 

Also Read : శ్రీ‌లంక‌కు భార‌త ద‌ళాలు పంప‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!