B Bommai CM : కర్ణాటక సర్కార్ కు ఢోకా లేదు – బొమ్మై
రోజుకు 2 గంటల పాటు పని చేస్తానని ప్రకటన
B Bommai CM : కర్ణాటక సీఎంను మార్చేస్తారంటూ వస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టింది బీజేపీ. ఇదే సమయంలో కాంగ్రెస్ చేసిన ట్వీట్లపై ఆర్థిక మంత్రి ఆర్. అశోక సంచలన కామెంట్స్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బొమ్మైని పూర్తి స్థాయి సీఎంగా ఉంటారని అన్నారు. ఈ తరుణంలో కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గురువారం బొమ్మై(B Bommai CM) మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు సీఎం. తాను రోజు పని చేసే కంటే మరో అదనంగా 2 గంటలు ఎక్కువగా పని చేస్తానని చెప్పారు బొమ్మై.
ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వానికి వచ్చిన చిక్కేమీ లేదన్నారు. స్థిరంగా ఉందని స్పష్టం చేశారు. ఇటీవల కరోనా బారిన పడ్డారు. కోలుకున్న తర్వాత ఇవాళ మాట్లాడారు.
యథావిధిగా తన సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన స్థానాన్ని భర్తీ చేయడంపై వచ్చిన ఊహాగానాలను నిరాధారమని , పూర్తిగా అబద్దమన్నారు బస్వరాజ్.
తన సీఎం పోస్టుపై వస్తున్న వివాదం, ఆరోపణలపై స్పందించారు. ఆగస్టు 6న పాజిటివ్ గా తేలిన తర్వాత హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు.
ఇటీవలి కాలంలో రాష్ట్ర బీజేపీలో కొంత సందడి నెలకొంది. కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉన్నత స్థాయితో సహా కొన్ని రకాల సమగ్ర మార్పులకు సంబంధించి ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ తరుణంలో బొమ్మై చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : మోదీకి రాఖీ కట్టిన పీఎంఓ సిబ్బంది చిన్నారులు