Balineni Srinivas Reddy : మాదే ప్ర‌భుత్వం జ‌గ‌నే సీఎం

మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి

Balineni Srinivas Reddy : అమ‌రావ‌తి – మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా, ఎంత‌గా త‌మ స‌ర్కార్ పై బుర‌ద చ‌ల్లినా, సీఎం జ‌గ‌న్ ను తూల నాడినా , రామోజీ ఎన్ని సార్లు ప్ర‌య‌త్నం చేసినా చివ‌ర‌కు ఓట‌మి పాల‌వ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు మాజీ మంత్రి.

Balineni Srinivas Reddy Comment

తుపాను బాధితుల ప‌రామ‌ర్శ పేరుతో చంద్ర‌బాబు నాయుడు, లోకేష్ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని, వాటిని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ ఉన్నార‌ని పేర్కొన్నారు. ఆదివారం బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy) మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌లో సెటిల‌ర్స్ ఉన్న ప్రాంతాల‌లో టీడీపీ ఎక్కువ‌గా ప్ర‌చారం చేసింద‌ని, ఆ ఓట్ల‌న్నీ కాంగ్రెస్ పార్టీకి గంప‌గుత్త‌గా ప‌డ‌తాయ‌ని భావించింద‌ని తీరా ఆ పార్టీకి న‌ష్టం త‌ప్ప చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. సెటిల‌ర్స్ పూర్తిగా వైసీపీ వైపు నిల‌బ‌డ్డార‌ని , రోడ్ల పైకి వ‌చ్చి రాద్దాంతం చేసినా, త‌న మీడియా ఎంత‌గా స‌పోర్ట్ చేసినా చివ‌ర‌కు ప్ర‌జ‌లు త‌మ తీర్పు వెలువ‌రించార‌ని అన్నారు.

తెలంగాణ‌లో విచిత్రం ఏమిటంటే టీడీపీ మ‌ద్ద‌తు కాంగ్రెస్ కు ఉంటే జ‌న‌సేన పార్టీ బీజేపీకి స‌పోర్ట్ చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి. తాము రాబోయే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని అన్నారు. మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని తిరిగి రెండోసారి సీఎంగా జ‌గ‌న్ రెడ్డి కొలువు తీర‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Telangana Assembly : 14 నుంచి తెలంగాణ అసెంబ్లీ

Leave A Reply

Your Email Id will not be published!