Bandi Sanjay : ఖాకీల తీరుపై బండి క‌న్నెర్ర‌

మంత్రి హ‌త్య కుట్ర అబ‌ద్దం

Bandi Sanjay : బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ మరోసారి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ పై హ‌త్య‌కు కుట్ర ప‌న్నారంటూ బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు.

ఈ కుట్ర వెనుక క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా కేసీఆర్ దేన‌ని ఆరోపించారు. చాలీ చాల‌ని బ‌తుకులు బ‌తికే వారు రూ. 15 కోట్ల సుపారీ ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. ఇది ప‌క్కా కేసీఆర్ రూపొందించిన సినిమా అని కానీ పూర్తిగా అట్ట‌ర్ ప్లాప్ అయ్యిందంటూ మండిప‌డ్డారు.

ఎఫ్ఐఆర్ లో డీకే అరుణ‌, జితేంద‌ర్ రెడ్డి పేర్లు లేక పోయినా టీఆర్ఎస్ నాయ‌కులు, శ్రేణులు వారిపై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై ఉన్న‌త‌స్థాయి విచార‌ణ సంస్థ‌ల‌ను ఆశ్ర‌యిస్తామ‌ని బండి సంజ‌య్(Bandi Sanjay) చెప్పారు.

మొత్తం ఈ కుట్ర కోణం వెనుక ఎవ‌రు ఉన్నార‌నేది తేలేంత దాకా తాము వ‌ద‌లి పెట్ట బోమంటూ హెచ్చ‌రించారు. దీని వెనుక ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పాత్ర ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంటుంద‌న్నారు.

అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారిన మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ను తొల‌గించాల్సింది పోయి సీఎం స‌పోర్ట్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. ఇక ఐపీఎస్ లు, పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు దారుణంగా ఉంద‌న్నారు.

స‌ర్కార్ కు కొమ్ము కాస్తూ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారంటూ ద్వ‌జ‌మెత్తారు. ఎవ‌రైతే మంత్రి అక్ర‌మాల‌పై ఆధారాల‌తో కోర్టులు, ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారో వారి పైనే హ‌త్య కేసు న‌మోదు చేయ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు బండి.

Also Read : రేవంత్ కామెంట్స్ డీజీపీ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!