Bandi Sanjay : టీఆర్ఎస్ ప‌త‌నం బీజేపీ విజ‌యం

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా విక్ట‌రీ మాదే

Bandi Sanjay  : తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్‌, ఎంపీ బండి సంజ‌య్ .

సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని ఇంత కాలం బురిడీ కొట్టిస్తూ వ‌చ్చిన సీఎం కేసీఆర్ కు త‌గిన రీతిలో బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నార‌ని జోస్యం చెప్పారు.

డ‌బుల్ బెడ్ రూం, ఉద్యోగాల భ‌ర్తీ, ద‌ళిత బంధు పేరుతో మోసం చేసిన ఘ‌న‌త సీఎంకే ద‌క్కుతుంద‌న్నారు. పొద్ద‌స్తమానం ఫామ్ హౌజ్ లో ఉండే కేసీఆర్ కు పాలించే అర్హ‌త లేద‌ని అన్నారు బండి సంజ‌య్(Bandi Sanjay).

న‌ల్ల‌గొండ‌లో ప‌ర్య‌టించిన ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో అమ‌లు చేయ‌కుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించారు.

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌ని మండిప‌డ్డారు బీజేపీ చీఫ్‌. ప్ర‌శ్నించే వాళ్ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయిస్తూ , అరెస్ట్ ల‌కు పాల్ప‌డుతున్న ప్ర‌భుత్వానికి పోయే కాలం వ‌చ్చింద‌న్నారు.

త‌మ పార్టీకి చెందిన నాయ‌కులంటే గులాబీ శ్రేణుల్లో వ‌ణుకు పుడుతోంద‌న్నారు. అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ చేసి త‌ప్పు చేశార‌ని మండిప‌డ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప‌క్క‌న పెట్టార‌ని రాబోయే రోజుల్లో కేసీఆర్ కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు.

చాలా చోట్ల త‌మ పార్టీకి చెందిన శ్రేణులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై దాడుల‌కు దిగుతున్నార‌ని కానీ తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

Also Read : ముగిసిన స‌మావేశం మోదీపై యుద్ధం

Leave A Reply

Your Email Id will not be published!