Bandla Krishna Mohan Reddy: బీఆర్‌ఎస్‌ లో మరో వికెట్ డౌన్ ! కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జంప్ !

బీఆర్‌ఎస్‌ లో మరో వికెట్ డౌన్ ! కాంగ్రెస్‌ లోకి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జంప్ !

Bandla Krishna Mohan Reddy: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్‌కు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నేతలు ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్‌ అవుతున్నారు. గురువారం రాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా… తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్దమౌతుంది.

Bandla Krishna Mohan Reddy Joined in Congress

గద్వాల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో భేటీ కూడా అయ్యారు. ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడాన్ని స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ లో చేరిన గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరితా తిరుపతయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరిత అనుచరులు గురువారం ఏకంగా సెల్‌ టవర్‌ ఎక్కడం, పెట్రోల్‌ పోసుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. సరితా తిరుపతయ్యతో రేవంత్‌ భేటీ అయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా సరితకు నచ్చజెప్పినట్టు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌లో చేరినా సరితకు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Also Read : AP-TG CMs Meet : రేపు భేటీ కానున్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

Leave A Reply

Your Email Id will not be published!